Vasundara: పోటీలోకి బాలయ్య సతీమణి.. వచ్చే ఎన్నికల్లో అక్కడ నుంచి పోటీ?

Vasundara: నటసింహం నందమూరి బాలయ్య ప్రస్తుతం సినిమాలతో పాటు పాలిటిక్స్ లోనూ బిజీబిజీగా ఉన్నాడు. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను డైరెక్షన్ లో వచ్చిన అఖండ సినిమాతో బాలయ్య తన నట విశ్వరూపం చూపించి బాక్సాఫీస్ ను షేక్ చేశాడు. ప్రస్తుతం క్రాక్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య ఓ సినిమా చేస్తుండగా.. తర్వాత అనిల్ రావిపూడి డైరెక్షన్ లో సినిమా చేయనున్న విషయం తెలిసిందే. బాలయ్య-అనిల్ రావిపూడి కాంబోలో సినిమాకు సంబంధించి ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చేసింది. ఇలా వరుస సినిమాలతో తీరిక లేకుండా బిజీగా ఉన్న బాలయ్య.. రాజకీయంగానూ యాక్టివ్ గా ఉన్నాడు.

హిందూపురంలో బాలయ్య పర్యటిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నాడు. ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో తన సొంత నిధులతో డెవలప్ మెంట్ కార్యక్రమాలు చేపడుతున్నాడు. షూటింగ్ లకు బ్రేక్ దొరకినప్పుడల్లా హిందూపురంలో బాలయ్య ప్రత్యక్షమవుతున్నాడు. ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వారికి అండగా నిలుస్తున్ాడు. ఇలా సినిమాలు, రాజకీయాలనూ రెండింటినీ బాలయ్య బ్యాలెన్స్ చేసుకుంటున్నాడు.

ఇప్పటికీ రెండుసార్లు హిందూపురం నుంచి బాలయ్య ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే ఈ సారి రూటు మార్చాలని బాలయ్య భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. బాలయ్య హిందూపురం అసెంబ్లీ స్థానానికి గుడ్ బై చెప్పనున్నారనే వార్త తెగ హల్ చల్ చేస్తోంది. హిందూపురం ఎంపీ స్థానానికి పోటీ చేసే యోచనలో బాలయ్య ఉన్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. హిందూపురం అసెంబ్లీ స్థానం నుంచి బాలయ్య సతీమణి వసుంధర వచ్చే ఎన్నికల్లో పోటీలోకి దిగనున్నారనే వార్తలొస్తున్నాయి.

ఇటీవల వసుంధర హిందూపురం నియోజకవర్గంలోనే ఎక్కువగా ఉంటున్నారు. హిందూపురంలో పర్యటిస్తూ టీడీపీ కార్యకర్తలు, నేతలతో మాట్లాడుతున్నారు. ప్రజల సమస్యలను కూడా తెలుసుకుంటున్నారు. ఇటీవల హిందూపురంలో ఎన్టీఆర్ మొబైల్ క్యాంటీన్ ను తన సొంత డబ్బులతో వసుంధర ప్రారంభించారు. దీంతో ఆమె ఫ్రెండ్స్, సన్నిహితులు సహాయం చేశారు. ఎన్టీఆర్ మొబైల్ క్యాంటీన్ ను ఆమె స్వయంగా ప్రారంభించారు. ఇక ఇటీవల బాలయ్య తన సొంత నిధులు 40 లక్షలతో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ ఆరోగ్య రధాన్ని తన భార్య వసుంధరతో కలిసి బాలయ్య ప్రారంభించారు.

హిందూపురంలో ఏ కార్యక్రమం చేపట్టినా సరే బాలయ్య వెంట వసుంధర ఉంటుంది. దీనిని బట్టి చూస్తే వచ్చే ఎన్నికల్లో హిందూపురం అసెంబ్లీ స్థానం నుంచి తన సతీమణిని బాలయ్య పోటీలోకి దింపనున్నారని, అందుకే ఆమెతో కలిసి హిందూపురంలో పర్యటిస్తున్నారనే ప్రచారం ఊపందుకుంది. గత ఎన్నికల్లో హిందూపురంలో బాలయ్య తరపున వసుంధర ప్రచారం చేశారు. కార్యకర్తలతో కూడా ఆమెకు పరిచయాలు ఉన్నాయి.దీంతో వచ్చే ఎన్నికల్లో ఆమె పోటీ చేయడం ఖాయమని కొంతమంది అంటున్నారు.

అయితే మరికొంతమంది మాత్రం ఈ ప్రచారాన్ని కొట్టివేస్తున్నారు. బాలయ్యకు తోడుగా ఉండటం కోసమే ఆమె హిందూపురం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారని అంటున్నారు. రాజకీయాలపై ఆమెకు ఆసక్తి లేదంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -