Balayya: వీరసింహారెడ్డి మరో అఖండ అవుతుందా?

Balayya: వీరసింహారెడ్డి మరో అఖండ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈ సినిమా అఖండ సినిమాను మించిన విజయాన్ని సాధించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

 

వరస అపజయాలు చూసిన బాలయ్య ఎవరు ఊహించని విధంగా అఖండతో అఖండ విజయాన్ని సాధించాడు. ఆరు పదుల వయసు దాటుతున్న ఈ నందమూరి అందగాడు ఇప్పటికీ తన స్పీడుకు బ్రేక్ లేదు అని నిరూపించుకున్నాడు. అఖండలో బాలకృష్ణ పర్ఫామెన్స్ కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. బాక్స్ ఆఫీస్ సైతం తలవంచి సలాం కొట్టింది. నేటి కుర్ర హీరోలు కూడా నటసింహానికి సాటిరారు అని బాలయ్య మరొకసారి అఖండ మూవీ తో చాటి చెప్పారు.

 

మరి అదే స్పీడ్ తో దూసుకుపోతున్న బాలయ్య కొత్తగా గోపీచంద్ మల్లినేని దర్శకత్వంలో వీరసింహారెడ్డి చిత్రాల్లో నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. 2023 సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి అన్ని సన్నాహాలు పూర్తికావస్తున్నాయి. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ఖరారు చేస్తూ జనవరి 12న ముహూర్తాన్ని ఫిక్స్ చేశాడు బాలయ్య.

 

రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో సినిమాలకు క్రేజ్ తెప్పించి ఫ్యాక్షనిజం ని ఒక లెవెల్ కి తీసుకెళ్లాడు బాలయ్య. సమరసింహారెడ్డి ,నరసింహనాయుడు చిత్రాలు ఇప్పటికీ ఇండస్ట్రీ హిట్స్ గానే నిలబడి ఉన్నాయి. ఇప్పుడు అదే నేపథ్యంలో వస్తున్న వీరసింహారెడ్డి మూవీ తిరిగి ఈ రికార్డులను బద్దలు కొట్టి సరికొత్త రికార్డు నెలకొల్పాలి అని అభిమానులు ఆశిస్తున్నారు

 

ఈ మూవీ టీజర్ లో బాలయ్య లుక్స్, సోషల్ మీడియాలో అక్కడక్కడ లీక్ అయినా కొన్ని మైండ్ బ్లోయింగ్ డైలాగ్స్ ఇప్పటికే జనాల్లో ఈ చిత్రంపై భారీ అంచనాలు పెంచాయి. అఖండ విజయం తరువాత బాలయ్య వరుసగా నాలుగు సినిమాల్లో నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే వాటన్నిటిలో ముందుగా రిలీజ్ అవ్వబోతున్న వీరసింహారెడ్డి పై అభిమానులు ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారు.

 

ఈ మూవీలో హీరోయిన్గా శృతిహాసన్ నటిస్తుంది. తమ నీ చిత్రానికి మ్యూజిక్ అందించడంతో సాంగ్స్ మీద కూడా భారీగా అంచనాలు ఉన్నాయి. జనవరి 12న బరిలోకి దిగబోతున్న వీరసింహారెడ్డి చిత్రం ఎటువంటి చరిత్ర సృష్టిస్తుందో తెలుసుకోవాలంటే వేచి చూడాల్సిందే.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -