Vijay Sai Reddy Vs Botsa Narayana: తాజాగా వైసీపీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి విశాఖ వాల్తేరు క్లబ్ పై చేసిన వ్యాఖ్యలు పార్టీలో కొత్త వివాదానికి తెరలేపాయి. 2014లో వైఎస్ విజయమ్మ ఓటమికి ప్రధాన కారణాల్లో ఒకటిగా ఆ పార్టీ భావించే వాల్తేరు క్లబ్ పై తాజాగా విజయసాయి మాట్లాడటం వైసీపీని మరోసారి ఇరకాటంలోకి నెట్టేసింది. వాల్తేరు క్లబ్ ను స్వాధీనం చేసుకుంటామని వ్యాఖ్యలపై మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నెల్లూరు ఎంపీగా పోటీ చేస్తూ విశాఖ వాల్తేరు క్లబ్ పై మాట్లాడటంపై అసహనం వ్యక్తం చేశారు.
విశాఖ వైసీపీ ఎంపీగా బొత్స సతీమణి ఝాన్సీ రెడ్డి పోటీ చేస్తున్నారు. దీంతో విజయసాయి రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలతో తమ విజయ అవకాశాలు దెబ్బతింటాయని అంచనా వేసిన బొత్స వెంటనే ఆ వ్యాఖ్యలను ఖండించారు. ఏదైనా ఉంటే జగన్ తో మాట్లాడాలి కానీ, ఇలా బహిరంగంగా మాట్లాడవద్దని అన్నారు. ఇప్పుడు వాల్తేరు క్లబ్ ఇష్యు గురించి మాట్లాడే అవసరం ఏముంది అని విజయసాయిని ప్రశ్నించారు బొత్స. నేను జగన్ ఉండగా వాల్తేరు క్లబ్ కు ఎలాంటి నష్టం వాటిల్లే చర్యలు జరగని ఆయన స్పష్టం చేశారు.