Vijay Sai Reddy: వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి గురించి అందరికీ తెలిసిందే. ఇటీవల కాలంలో ఏపీ పాలిటిక్స్ లో ఎక్కువగా వినిపిస్తున్న పేర్లలో విజయ సాయి రెడ్డి పేరు కూడా ఒకటి. తరచూ టీడీపీ పై చంద్రబాబు నాయుడు టీడీపీ నేతలపై విమర్శలు గుప్పిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన తాజాగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా సోషల్ మీడియాలో ట్వీట్ చేస్తూ అందులో ఈ విధంగా రాసుకొచ్చారు.. వివిధ జాతీయ సర్వేలలో వైసీపీ గెలుస్తుందనే వార్తలు జోరుగా వస్తున్నాయి.
అయితే దీనిపై పచ్చమీడియా సొంత కథనాలు వండీవారుస్తోందని విజయసాయి రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఏ జాతీయ సంస్థ సర్వే వచ్చినా అది ఫేక్, పెయిడ్ అంటూ పచ్చ మీడియా సొంత కథనాలు వండి వారుస్తోందని, మరి ఇండియా టుడే టీవీ సర్వే మాత్రమే అసలు సిసలు సర్వే అంటూ ఊదరగొడుతోందని పేర్కొన్నారు. పచ్చ పార్టీ గెలుస్తుందని చెబితేనే ఒరిజినల్, లేకపోతే ఫేకా? అని ఆయన ప్రశ్నించారు.
లాగే పరాజితులు, ఒకప్పటి రౌడీ షీటర్లు, చిల్లర నేరగాళ్లు హెచ్చరికలు చేస్తే వీధి కుక్కలు కూడా భయపడవని విమర్శలు కురిపించారు. వచ్చే ఎన్నికల్లో గ్యారంటీగా గెలుస్తామనే ధీమా తెలుగుదేశం పార్టీలో ఒక్కడికీ లేదని అన్నారు. ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఏపీలో హాట్ టాపిక్ గా మారాయి.