Vijay Sai Reddy: ఏపీ బీజేపీ అధినేత్రి పురందేశ్వరిని వైసీపీ టార్గెట్ చేసింది. బీజేపీ రాష్ట్ర నాయకురాలిగా వైసీపీపై ఎలాంటి విమర్శలు చేసిన మాట మాట్లాడరన్న ఉద్దేశంతో ఈమె వైఎస్ఆర్సిపి పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అదేవిధంగా ఏపీ ప్రభుత్వం కేంద్రం నుంచి తీసుకున్నటువంటి అప్పుల గురించి కూడా ఈమె విమర్శలు కురిపించారు. అదేవిధంగా ఈ అప్పుల వ్యవహారంపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి కి కూడా ఫిర్యాదు చేశారు.
ఇలా వైఎస్ఆర్సిపి పార్టీ గురించి పురందేశ్వరి ఎన్నో విమర్శలు చేస్తున్న మౌనంగా ఉన్నారని భావిస్తున్నటువంటి తరుణంలో వైఎస్ఆర్సిపి ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా పురందేశ్వరికి గట్టిగా కౌంటర్ ఇచ్చారు. ఈమె నటనలో తన తండ్రిని మించిన నటి అని తనని మహానటి అంటూ ఆమెపై కౌంటర్ చేస్తూ చేసినటువంటి ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ…
అమ్మా, పురందేశ్వరిగారు బీజేపీ అంటే బాబు జనతా పార్టీ కాదు బాబుది స్క్రిప్ట్… వదినది డైలాగ్ తండ్రి పెట్టిన పార్టీపై ప్రేమ…మరిది కళ్ళలో ఆనందమే టార్గెట్! మీ నాన్నగారు మహానటులు… మీరు కాదనుకున్నాం. పార్లమెంటులో ఎన్టీఆర్ విగ్రహం పెట్టినప్పుడు సోనియాకు ధన్యవాదాలు పలికిన మీరు అదే ఉత్సాహంతో ఇప్పుడు బీజేపీలో జీవిస్తున్నారంటే మీ నటనాకౌశలాన్ని అభినందించాల్సిందే అంటూ పురందేశ్వరికి కౌంటర్ ఇస్తూ ఈయన ట్వీట్ చేశారు.
ఇక గతంలో తన తండ్రిని కీర్తిస్తూ, అలాంటి గొప్ప వ్యక్తి విగ్రహాన్ని పార్లమెంట్లో పెట్టేందుకు అంగీకరించిన కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, నాటి లోక్సభ స్పీకర్ మీరా కుమార్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈమె చేసినటువంటి ట్వీట్ కి సంబంధించిన ఫోటోలను కూడా ఈయన పెట్టారు వేదికగా జోడించారు పని చేస్తున్నారని స్పష్టంగా అర్థమవుతుంది.