Veera Simha Reddy: వీరసింహారెడ్డి ఫ్యాన్స్ కు భారీ షాక్.. ఏమైందంటే?

Veera Simha Reddy: తెలుగు సినిమా ఇండస్ట్రీలో డైలాగులు చెప్పాలన్నా, ఆ డైలాగులతో థియేటర్లో పూనకాలు తేవాలన్న అది ఒక్క నందమూరి వారసులకు మాత్రమే సాధ్యం. అందునా నందమూరి బాలయ్య డైలాగులు చెబుతున్నాడంటే థియేటర్ మొత్తం ఊగిపోవాల్సిందే. తాజాగా నందమూరి బాలయ్య ‘వీరసింహారెడ్డి’గా సంక్రాంతి బరిలో థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమైపోయాడు.

 

డైరెక్టర్ గోపిచంద్ మలినేని డైరెక్షన్ లో నందమూరి బాలయ్య చేస్తున్న ‘వీరసింహారెడ్డి’ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదల కాగా.. అది బాలయ్య ఫ్యాన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ట్రైలర్ లో బాలయ్య చెప్పే డైలాగులకు ఫ్యాన్స్ గోలగోల చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ డైలాగులకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం ఇండస్ట్రీలో చర్చకు దారితీసింది. ఫ్యాన్స్ కు థియేటర్లలో షాక్ తప్పదనే వార్త అందరిలో ఆసక్తిని రేపుతోంది.

 

తాజాగా విడుదలైన ‘వీరసింహారెడ్డి’ సినిమా ట్రైలర్ లో కొన్ని డైలాగులు పొలిటికల్ హీట్ పెంచుతున్నాయి. పేరు మార్చడం గురించి బాలయ్య బాబు చెప్పే డైలాగుకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. అందరూ ఎంజాయ్ చేసే ఇలాంటి కొన్ని డైలాగులు ట్రైలర్ ను పీక్స్ కు తీసుకెళ్లింది. అయితే ఈ డైలాగులు పొలిటికల్ హీట్ ను పెంచాయి. ఏపీ సీఎం జగన్ ను టార్గెట్ చేసేలా బాలయ్య సినిమాలో డైలాగులు ఉండటంతో ఈ డైలాగులు సినిమాలు ఉంటాయా అనే చర్చ మొదలైంది.

 

ఈ సంక్రాంతికి విడుదల కానున్న బాలయ్య బాబు ‘వీరసింహారెడ్డి’ సినిమా ట్రైలర్ లో వినిపించే డైలాగులు, సినిమాలో కనిపించవనే టాక్ నడుస్తోంది. జగన్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ఈ డైలాగులను సినిమాలో కట్ చేశారనే టాక్ వినిపిస్తోంది. జగన్ తో గొడవ పడి సినిమా రిలీజ్ విషయంలో ఇబ్బంది పడకుండా ఉండటం కోసం నిర్మాతలు సినిమాలోని బాలయ్య డైలాగులను కత్తిరించినట్లు సమాచారం.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -