Brahmanandam: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ హీరోలుగా నటుడు సముద్రఖని దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం బ్రో. ఈ సినిమా ఈనెల 28వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో భారీగా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా సాయి ధరంతేజ్ వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. అదేవిధంగా మంగళవారం సాయంత్రం శిల్పకళా వేదికలో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించిన సంగతి మనకు తెలిసిందే.
ఈ కార్యక్రమానికి వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్ వంటి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో భాగంగా నటుడు బ్రహ్మానందం కూడా పాల్గొన్నారు. అయితే ఈయన ఈ సినిమాలో ఒక కీలకపాత్రలో నటించారు. ఈ కార్యక్రమంలో భాగంగా బ్రహ్మానందం వేదికపై మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా బ్రహ్మానందం మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ తో నటించే అవకాశం రావడం నిజంగా అదృష్టం అని తెలిపారు.
అదేవిధంగా పవన్ కళ్యాణ్ ను తాను 20 సంవత్సరాల వయసు నుంచి చూస్తున్నానని తెలిపారు. పత్తికాయ నుంచి పత్తి బయటకు వచ్చినప్పుడు ఎంత తెల్లగా అందంగా ఉంటుందో పవన్ కళ్యాణ్ కూడా అంతే స్వచ్ఛమైన మనసుతో అందరిని నవ్విస్తూ నవ్వుతూ ఉంటారని బ్రహ్మానందం తెలిపారు.ఇక మీరందరూ ఇలా చప్పట్లు కొట్టడం కాదు అందరూ కలిసి ఆయన ఎంచుకున్న ఆశయాలను గెలిపించాలని బ్రహ్మానందం తెలిపారు.
ఈ చప్పట్లు ఆయనకు విజయాన్ని కలిగించాలని తెలిపారు. ఇక పవన్ కళ్యాణ్ మంచితనం హాస్యం కావాలనుకునే వారికి ఇష్టమైన అవతారంలో కనిపించే దైవంశ సంభూతుడు అని పవన్ కళ్యాణ్ గురించి బ్రహ్మానందం చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.పవన్ కళ్యాణ్ గురించి ఈ నాలుగు మాటలు చెప్పడానికి తాను ఇక్కడికి వచ్చాను అంటూ ఈ సందర్భంగా బ్రో సినిమాని అందరూ సక్సెస్ చేయాలని బ్రహ్మానందం చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.