Byreddy Siddharth Reddy: వైరల్ అవుతున్న బైరెడ్డి సిద్దార్థరెడ్డి సంచలన వ్యాఖ్యలు!

Byreddy Siddharth Reddy: టిడిపి అధినేత చంద్రబాబుపై రాష్ట్ర వైసీపీ యువజన సంఘం అధ్యక్షుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాజాగా విశాఖలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చంద్రబాబుపై విరుచుకుపడ్డాడు. తాజాగా ఎన్టీ రామారావు శతజయంతి వేడుకలకు సూపర్ స్టార్ రజినీకాంత్ ని అతిథిగా ఆహ్వానించారు. ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు గురించి రజనీకాంత్ చాలా గొప్పగా మాట్లాడుతూ ప్రశంసలు కురిపించాడు.

రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే వైసీపీ నాయకులు వివిధ రకాలుగా స్పందిస్తూ రజనీకాంత్ ని ఒక ఆట ఆడుకుంటున్నారు. ఇక తాజాగా జరిగిన సమావేశంలో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు మోసగాడని,1999లో బీజేపీ నేత‌లు, 2014లో ప‌వ‌న్‌క‌ల్యాణ్‌తో తాను మంచోడ‌ని ప్ర‌జ‌ల‌కు చెప్పించార‌ని గుర్తు చేశారు. అయితే అప్పుడు వారి మాటలు నమ్మిన ప్రజలు ఆయనకు అవకాశం ఇచ్చారని సిద్ధార్థ రెడ్డి తెలిపాడు.

 

2019లో మాత్రం చంద్రబాబు నాయుడు గురించి తెలిసిన ప్రజలు అతనికి ఓటమిని బహుమతిగా ఇచ్చారని తెలిపాడు. ఇక 2024 ఎన్నిక‌లు వ‌స్తున్నాయ‌ని, ఇప్పుడు చంద్ర‌బాబు ఎవ‌రిని అడ‌గాల‌ని బైరెడ్డి ప్రశ్నించారు. ఇప్పటికే ప్ర‌ధాని మోదీ చంద్రబాబుని పట్టించుకోవటం లేదు… బాబు గురించి ప‌వ‌న్‌క‌ల్యాణ్ చెప్పినా ప్రజలు నమ్మే స్థితిలో లేరని బైరెడ్డి సిద్దార్థ రెడ్డి తెలిపారు. అలాగే కాంగ్రెస్, బీజేపీ నేత‌లు చెప్పినా నమ్మే అవకాశాలు లేవు.

 

తాజాగా పక్క రాష్ట్రం తమిళనాడు నుండి ర‌జినీకాంత్‌ను ప‌ట్టుకొచ్చార‌ని వ్యంగ్యంగా అన్నారు. మొదటి విడతలో రజనీకాంత్ ఇక రెండో విడ‌త‌లో ఐశ్వ‌ర్య‌రాయ్‌, అమితాబ‌చ్చ‌న్‌, షారుక్‌ఖాన్‌, దీపికా ప‌ద‌కొనే త‌దిత‌రులంతా వ‌చ్చి చంద్ర‌బాబు గొప్పోడ‌ని, మ‌ళ్లీ ఒక అవ‌కాశం ఇవ్వాల‌ని కోరుతార‌ని సెటైర్స్ విసిరారు. చంద్రబాబుకి కొంచెమైనా సిగ్గుండాల‌ని బైరెడ్డి మండిప‌డ్డారు.

 

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -