Nalgonda: ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా కూడా పరువు హత్యలు కలకలం రేపుతున్నాయి. పరువు కోసం ఎదుటి వ్యక్తులను మానవత్వం మరిచి అతి దారుణంగా పొడిచి హత్య చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఇలాంటి ఘటనలు పదుల సంఖ్యలో వెలుగులోకి వస్తున్నాయి. పరువు కోసం హత్యలకు పాల్పడి కటకటాల పాలవుతున్నారు. తాజాగా నల్గొండ జిల్లాలో కూడా మరో పరువు హత్య ఘటన వెలుగులోకి వచ్చింది. మాట్లాడుదామంటూ ఇంటికి పిలిచి యువకుణ్ని కొట్టిచంపేశారు యువతి కుటుంబ సభ్యులు.
పూర్తి వివరాల్లోకి వెళితే.. నల్గొండ జిల్లా గుర్రంపూడి మండలం కొప్పోలుకు చెందిన యువతి కట్టంగూడి మండలానికి చెందిన సంతోష్ ఇద్దరూ నల్గొండలో చదువుకునేవారు. హైస్కూల్ లో చదువుకుంటున్న సమయంలోనే ఇద్దరు ప్రేమలో పడ్డారు. ఒకరి నొకరు గాఢంగా ప్రేమించుకున్నారు. అయితే వారిద్దరీ ప్రేమ వ్యవహారం గురించి ఇంట్లో తెలిసింది. ఈ క్రమంలోనే పెళ్లి గురించి మాట్లాడదాం రమ్మని సంతోష్కి ఫోన్ చేసి పిలిచింది ప్రియురాలు. ప్రేమించిన ప్రియురాలు పెళ్లి చేసుకుందామని రమ్మని పిలవడంతో సంతోషంగా వెళ్లిపోయాడు సంతోష్. కొప్పోలులో అమ్మాయి ఇంటికి వెళ్లాడు. అక్కడ తన ప్రియురాలు లేదు.
కాని కనుచూపు మేరలో మృత్యువు మాత్రం కనిపించింది. సంతోష్ ని చూసిన ఆ అమ్మాయి తల్లి తండ్రులు విరుచుకుపడ్డారు. కర్రలతో విచ్చలవిడిగా కొట్టడంతో అక్కడికక్కడే చనిపోయాడు సంతోష్. ఊరు ఊరంతా చూస్తుండగానే ఒక ప్రాణం పోయింది. మృతుడి తల్లిదండ్రులు సూరత్లో కల్లు గీత కార్మికులు. స్థానికుల ఫిర్యాదు మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సంతోష్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.