Nalgonda: పట్టపగలే యువకుడిని నరికి చంపి దుండగులు.. ఎక్కడంటే?

Nalgonda: తాజాగా నల్గొండ జిల్లాలో ఒక దారుణమైన ఘటన చోటు చేసుకుంది. కొందరు దుండగులు పట్టపగలే నడి రోడ్డుపై ఒక యువకుడిని అత్యంత కిరాతకంగా నరికి చంపేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. నల్లగొండ జిల్లా త్రిపురారం మండలం అన్నారం గ్రామంలో ఇరిగి నవీన్ అనే 21 ఏళ్ళ యువకుడు నివసిస్తున్నాడు. నవీన్ కి అదే గ్రామానికి చెందిన యువతితో పరిచయం ఏర్పడగా ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి నాలుగేళ్ల నుంచి వారు ప్రేమలో మునిగి తేలుతున్నారు. ఇది ఇలా ఉంటే ఇటీవలే ఆ యువతకి ఆమె తల్లిదండ్రులు పెళ్లి చేయాలనే సంబంధాలు చూడడం మొదలుపెట్టారు.

ఆ విషయం ప్రియుడు నవీన్ కి తెలియడంతో ఆత్మహత్య చేసుకోగా అదృష్టవశాత్తు చికిత్స పొంది కోలుకున్నాడు. ఈ నేపథ్యంలోనే నవీన్ యువతీ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి మీ అమ్మాయిని ప్రేమిస్తున్నాను పెళ్ళికి ఒప్పుకోవాలని వారిని కోరాడు. ఇద్దరి కులాలు వేరు కావడంతో యువతి పెళ్లికి యువతి కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. ఇది ఇలా ఉంటే తాజాగా యువత తరపున బంధువులు ఆదివారం నవీన్ కి ఫోన్ చేసి నవీన్ తో మాట్లాడాలి అని చెప్పడంతో వారి మాటలు గుడ్డిగా నమ్మిన నవీన్ ఫ్రెండ్స్ తో పాటు యువతి బంధువులు పిలిచిన ప్రదేశానికి వెళ్ళాడు. యువతి బంధువులు తొమ్మిది బైకులపై వచ్చారు.

నవీన్ రాకను గమనించి పట్టపగలే నడిరోడ్డుపై అత్యంత కిరాతకంగా పొడిచి చంపేశారు. ఆ ఘటనలో తీవ్రంగా గాయపడిన నవీన్ రక్తపు మడుగుల్లో అక్కడికక్కడే మృతి చెందాడు. వెంటనే స్పందించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా హుటాహుటిన ఘటస్థలానికి చేరుకున్న పోలీసులు నవీన్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్ కి తరలించారు. విషయం తెలుసుకున్న నవీన్ తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు గుండెలు వెలిసేలా రోదిస్తున్నారు. అనంతరం నవీన్ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తుని మొదలుపెట్టారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -