Prathipati: ప్రత్తిపాటి దెబ్బకు చంద్రబాబు సైలెంట్ కావాల్సిందే.. అలా అనడంతో?

Prathipati: తాజాగా మాజీ మంత్రి ప‌త్తిపాటి పుల్లారావు అధిష్టానం పై ఫైర్ అవ్వడం ఆ పార్టీలో క‌ల‌క‌లం రేపుతోంది. టీడీపీ ఇంచార్జ్ ఉండ‌గానే, వారికి పోటీగా మ‌రొక నాయ‌కుడిని లోకేశ్ ప్రోత్స‌హిస్తుండ‌డంతో టీడీపీ సీనియ‌ర్ నేత‌ల‌కు ఆగ్ర‌హం తెప్పిస్తోంది. ఈ నేప‌థ్యంలో చిల‌క‌లూరిపేట‌ లో గ‌త కొంత కాలంగా భాష్యం ప్ర‌వీణ్ త‌న‌కు వ్య‌తిరేకంగా ఒక వ‌ర్గాన్ని కూడ‌గ‌ట్ట‌డాన్ని పుల్లారావు జీర్ణించుకోలేక‌పోతున్నారు.

భాష్యం ప్ర‌వీణ్‌ తో పాటు ఇలాంటి వ్య‌క్తుల‌ను ప్రోత్స‌హించ‌డం పై అధిష్టానానికి కూడా ఆయ‌న చుర‌క‌లు అంటించారు. భాష్యం ప్ర‌వీణ్ లాంటి నేత‌ల‌కు టికెట్ ఇస్తే ఎలా అని ఆయ‌న ప‌రోక్షంగా చంద్ర‌బాబును నిల‌దీశారు. ఇటీవ‌ల భాష్యం ప్ర‌వీణ్ వివిధ అవ‌స‌రాల కోసం రెండు ద‌ఫాలుగా కోటి రూపాయ‌లు విరాళం ఇవ్వ‌డాన్ని దృష్టిలో పెట్టుకుని పుల్లారావు దెప్పి పొడిచారు. ప్ర‌వీణ్‌కు అస‌లు చిల‌క‌లూరిపేట‌లో ఓటే లేద‌ని ఆయ‌న గుర్తు చేశారు. చిల‌క‌లూరిపేట‌లో చోటు చేసుకుంటున్న ప‌రిణామాల‌ను చంద్ర‌బాబు దృష్టికి తీసుకెళ్లాల‌ని తెలిపారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: అవినాష్ రెడ్డి ఏ తప్పు చేయలేదా.. అలా అయితే హత్య చేసిందెవరో చెప్పు జగన్?

CM Jagan:  ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల పులివెందులలో నిర్వహించినటువంటి సభలో వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. చిన్నాన్న వివేకం బాబాయ్ కి...
- Advertisement -
- Advertisement -