Chandrababu: 2024లో టీడీపీదే గెలుపంటున్న చంద్రబాబు.. ఎవరికీ సాధ్యం కాదంటూ?

Chandrababu: తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి లో రా కదలిరా బహిరంగ సభను సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి రా కదలిరా అని పిలుపునిస్తే మహానాడుని తలపించే విధంగా సభకు ప్రజలు తరలి వచ్చారని తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.

 

ఒక సైకో పాలన రాష్ట్రంలో జరుగుతుందని, మానసిక రోగి పరిపాలిస్తున్నాడని సీఎం జగన్ పై చంద్రబాబు నాయుడు విరుచుకుపడ్డారు. త్వరలోనే మనకి మంచి రోజులు వస్తాయని తెలుగుదేశం, జనసేన గెలుపుని ఎవరు ఆపలేరని, తెలుగుదేశం పార్టీ రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసమే కానీ జనసేన కోసం కాదని భావితరాల భవిష్యత్తుని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చంద్రబాబు నాయుడు అన్నారు.

నేను 24 గంటలు ప్రజలతోనే ఉన్నాను ఎప్పుడు మర్డర్లు చేయలేదు మర్డర్లు చేసిన వాళ్ళని సపోర్ట్ చేయలేదు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేల తిరుగుబాటు ప్రారంభమైంది. ఎన్నికల ముందే ఈ పార్టీ ఓడిపోతుంది. ఎన్నికల సమయానికి పార్టీ ఖాళీ అయిపోతుంది. మమ్మల్ని అధికారంలో నిలబెట్టండి అని నేను అడగడానికి రాలేదు.ఈ రాష్ట్రాన్ని అధికార పదంలో నిలబెట్టడానికి మీరు ముందుకు వస్తారా అని అడుగుతున్నాను. మీ ఆశీర్వచనాలని మీ చప్పట్ల ద్వారా తెలియజేయండి అంటూ వచ్చిన కార్యకర్తలని ఉత్సాహపరిచారు.

 

ఐదు కోట్ల మంది కూడా నిన్ను దించేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆరోజు ఉద్యోగాలు ఇస్తాను అని మాట ఇచ్చాడు నేటికీ ఐదేళ్లు పూర్తవుతున్నాయి. ఒక ఉద్యోగం అయినా ఇచ్చాడా.. ఇవ్వలేదు సరి కదా ఉద్యోగాలు అడిగిన వాళ్ళకి గంజాయి ఇస్తున్నాడు అంటూ తన ఆవేదన వ్యక్తం చేశాడు. 2024లో గెలిచేది తెలుగుదేశం. మా గెలుపుని ఎవరు ఆపలేరు అంటూ ధీమా వ్యక్తం చేశాడు చంద్రబాబు నాయుడు. కాగా రా కదలిరా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు చంద్రబాబు జిల్లాకు వస్తున్న సందర్భంగా పార్టీ నాయకులు అభిమానులు పెద్ద ఎత్తున స్వాగత సత్కారాలు ఏర్పాటు చేశారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -