ChandraMohan: రూ.100 కోట్ల వరకు పోగొట్టుకున్నా.. జయసుధ పరిస్థితీ అంతే!: చంద్రమోహన్

ChandraMohan: టాలీవుడ్ గర్వించే నటుల్లో చంద్రమోహన్ ఒకరు. వెయ్యికి పైగా చిత్రాల్లో నటించిన ఈ వెటరన్ యాక్టర్.. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హాస్య నటుడిగా ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించి ఆకట్టుకున్నారు. అయితే నాలుగేళ్లుగా మాత్రం ఆయన వెండితెరకు దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం ఆయన తన కుటుంబంతో కలసి ఇంటి దగ్గరే ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నారు.

ఒక్క రూపాయి తీసుకున్నా కలిసొస్తుంది: జలంధర
చంద్రమోహన్ భార్య జలంధర ప్రముఖ రచయిత్రి అనే విషయం తెలిసిందే. తాజాగా ఈ దంపతులిద్దరూ ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. చంద్రమోహన్ చేతితో ఒక్క రూపాయి తీసుకున్నా కలిసొస్తుందని జలంధర అన్నారు. ‘చంద్రమోహన్ చేతితో డబ్బులు తీసుకునేందుకు మా ఇంటికి చాలా మంది వస్తారు. జనవరి ఒకటో తారీఖున ఎంతోమంది వస్తారు. అలా ఆయన చేత్తో నాక డబ్బులివ్వడం వల్లే నాకూ మంచి రచయిత్రిగా పేరొచ్చింది’ అని జలంధర చెప్పడంతో చంద్రమోహన్ భావోద్వేగానికి గురై.. కళ్లు తుడుచుకున్నారు.

జలంధరతోపాటు చంద్రమోహన్ కూడా ఈ ఇంటర్వ్యూలో ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు. తాను సంపాదించి పోగొట్టుకున్న ఆస్తుల గురించి కూడా ఆయన చెప్పారు. ‘గొల్లపూడి మారుతీరావు కోంపల్లి దగ్గర ద్రాక్షతోట కొన్నారు. నన్నూ కొనమని చెప్పారు. నేనూ 35 ఎకరాల దాకా కొన్నాను. కానీ దాన్ని మేనేజ్‌ చేయలేక అన్నీ అమ్మేశాను. శోభన్‌ బాబు చెప్తున్నా వినకుండా మద్రాసులో 15 ఎకరాలు అమ్మాను. ఈరోజు దాని విలువ రూ.30 కోట్లు’ అని చంద్రమోహన్ చెప్పుకొచ్చారు.

జయసుధ పరిస్థితి అంతే..: చంద్రమోహన్
‘శంషాబాద్‌ దగ్గర మెయిన్‌ రోడ్‌కు 6 ఎకరాల భూమిని నేను కొన్నాను. కాని అది కూడా అమ్మేశాను. ఇప్పుడక్కడ మంచి రిసార్టులు పెట్టారు. అలా దాదాపు రూ.100 కోట్ల వరకు పోగొట్టుకున్నాను. సంపాదించిన వాటికన్నా పోగొట్టుకున్నవే ఎక్కువ. సీనియర్ నటి జయసుధ పరిస్థితి కూడా అదే’ అని చంద్రమోహన్ పేర్కొన్నారు.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -