Kerela: ఇటీవల కాలంలో చాలామంది సంపాదించడమే ధ్యేయంగా పెట్టుకుని అడ్డదారులు తొక్కుతున్నారు. సంపాదించడం కోసం పిచ్చి పిచ్చి పనులు చేస్తూ లైఫ్ ని రిస్క్ లో పెడుతున్నారు. ఇటీవల కాలంలో అటువంటి ఘటనలు ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా అటువంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. కేరళ తిరువనంతపురం పరిధిలోని చుల్లిమనూరుకు చెందిన వినీషా అనే 29 ఏళ్ళ యువతి కవడియార్ కు చెందిన వరుణ్ బాబు 24 ఏళ్ళ యువకుడు ఇద్దరు స్నేహితులు. వీరికి గత కొంత కాలం నుంచి పరిచయం ఉంది.
ఈ పరిచయంతోనే ఇద్దరూ ఏదైనా చేసి డబ్బులు సంపాదించాలి అనుకున్నారు. అనుకున్న విధంగానే ఇద్దరికీ సంపాదించడానికి ఒక ఆలోచన వచ్చింది. అదే అక్రమంగా హైబ్రిడ్ థాయిలాండ్ గంజాయిని తరలించడం. ఇక అనుకున్నదే ఆలస్యం ఆ యువతి, యువకుడు ఆ దిశగా చకచకలు పనులు స్టార్ చేసి బిజెనెస్ కూడా మొదలు పెట్టేసారు. అలా పోలీసుల కళ్లు గప్పి వీళ్లు గత కొంత కాలంగా గంజాయి సరఫరా కొనసాగిస్తున్నారు. కాగా ఇటీవల వీళ్లిద్దరూ ఒక లగ్జరీ బస్సులో బెంగుళూరు నుంచి తిరువనంతపురం వెళ్తున్నారు.
దీంతో ఎందుకో అనుమానం వచ్చిన యాంటీ నార్కోటిక్స్ బృందం బస్సును పరుశువాకల్ వద్ద ఆపి తనిఖీలు నిర్వహించారు. ఇక వినీషా, వరుణ్ బాబు దగ్గర ఉన్న ప్లాస్టిక్ కవర్ బ్యాగును పరిశీలించగా అందులో ఏకంగా 15 గ్రాముల హైబ్రిడ్ థాయిలాండ్ గంజాయి కనిపించింది. దీనిని చూసిన పోలీసులు ఒక్కసారిగా షాక్ కి గురైన బృందం అంత పెద్దమొత్తంలో సరఫరా చేస్తున్న వినీషా, వరుణ్ బాబులను యాంటీ నార్కోటిక్స్ బృందం అరెస్ట్ చేసింది. వారిని చూసిన తోటి ప్రయాణికులు కొంతమంది షాక్ కు గురయ్యారు.