CM Jagan: త్వరలోనే ఏపీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేశారు. ఇక నామినేషన్ ప్రక్రియ కూడా మొదలు కావడంతో ఇప్పటికే పలువురు నేతలు నామినేషన్ కూడా దాఖలు చేశారు. ఇక ఎన్నికల త్వరలోనే జరగబోతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఎన్నో సర్వేలు 2024లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే విషయాలను వెల్లడించాయి. అయితే ఈ సర్వేలలో వైసీపీనే అధికారంలోకి వస్తుందని తెలుస్తోంది.
ఇలా ఈసారి కూడా వైసిపి పార్టీ అధికారంలోకి రాబోతుందని పలు సర్వేలు వైసీపీకే విజయం ఖాయం అంటూ వారి సర్వే ఫలితాలను వెల్లడించారు. అయితే గెలుస్తామని భ్రమలో వైసిపి నాయకులు ఉన్నారని తెలుస్తుంది .2019 ఎన్నికల సమయంలో కూడా తామే అధికారంలోకి వస్తామని తెలుగుదేశం పార్టీ ధీమా వ్యక్తం చేశారు కానీ వైసీపీ అఖండ మెజారిటీతో గెలుపు సొంతం చేసుకుంది.
ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందించామని ప్రచార కార్యక్రమాలను చెబుతూ దీంతో గాంభీర్యంతో ఎన్నికల ప్రచారంలోకి వెళ్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఈసారి నిరాశ తప్పదని చెప్పాలి. ఎందుకంటే భారీ స్థాయిలో డబ్బును ఇచ్చి సర్వేలు చేయించుకుంటే వారికి అనుకూలంగా కాకుండా ప్రజా తీర్పును వ్యతిరేకంగా ఎవరు చెప్పలేరు అందుకే వైసిపి చేయించిన సర్వేలకు వారికి అనుకూలంగానే ఫలితాలు వచ్చాయి.
ఇలా సర్వేలను కొనుగోలు చేసి తాము ఎన్నికలలో గెలుపొందుతామంటే సరిపోతుందా ప్రజలు స్వచ్ఛందంగా ఓట్లు వేసి గెలిపించాలి కదా అయితే ప్రస్తుతం తామే గెలుస్తామనే ఊహలలో ఉన్నటువంటి వైసీపీ నాయకులు జూన్ 4వ తేదీ ఈ భ్రమ నుంచి బయటపడతారని తెలుస్తోంది.