Adipurush: ప్రభాస్ హీరోగా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి తాజా చిత్రం ఆది పురుష్. ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ దేశవ్యాప్తంగా జూన్ 16వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది అయితే ఈ సినిమా పట్ల కొందరు ప్రశంసలు కురిపించగా మరికొందరు భారీ స్థాయిలో ట్రోల్స్ చేస్తున్నారు. ఈ సినిమా టీజర్ విడుదలైనప్పటి నుంచి ఈ సినిమాపై నెగిటివ్ విమర్శలు వస్తూనే ఉన్నాయి.
ఇలా ఈ సినిమా పట్ల ఎన్ని నెగిటివ్ విమర్శలు వచ్చినా ఈ సినిమాని అడ్డుకోవాలని ప్రయత్నాలు చేసినా కూడా ఈ సినిమా మాత్రం అద్భుతమైన కలెక్షన్లను రాబడుతూ దూసుకుపోతుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా గురించి వస్తున్నటువంటి విమర్శలపై మైత్రి మూవీ మేకప్ డిస్ట్రిబ్యూటర్ శశిధర్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన ఈ సినిమా గురించి మాట్లాడుతూ పలు విషయాలను తెలియజేశారు.
ఈ సినిమాని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా చిన్నపిల్లలు ఎంతో ఆసక్తిగా ఈ సినిమాని చూస్తున్నారని, థియేటర్లన్ని జైశ్రీరామ్ అనే నినాదాలతో మారుమోగుతున్నాయని శశిధర్ రెడ్డి తెలిపారు. ఈ సినిమా పట్ల విమర్శలు రావడంతో డైరెక్టర్ ఓం రౌత్ ఆరు నెలలపాటు సమయం తీసుకుని సినిమాని చాలా అద్భుతంగా తీర్చిదిద్దారని ఈయన తెలియజేశారు.
ఒక దేవుడి సినిమాని చాలామంది అడ్డుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే ఈ సినిమా పట్ల చాలామంది ట్రోల్స్ కూడా చేస్తున్నారు. ఇలా దేవుడు సినిమాని అడ్డుకొని ఈ సినిమాని ఆపాలనే ప్రయత్నం చేస్తున్న వారిని దేవుడే చూసుకుంటారు. ఈ సినిమా పై భారీగా ట్రోల్స్ చేసేవారికి ఆ భగవంతుడే శిక్షిస్తాడు అంటూ శశిధర్ రెడ్డి ఈ సందర్భంగా చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.