CPI Narayana: జగన్ పై విమర్శలు చేస్తున్న సీపీఐ నారాయణ.. పవన్ తో పొత్తు కోసమేనా?

CPI Narayana: ఏపీ సీఎం జగన్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వద్ద పచ్చగడ్డి వేస్తే భగ్గు మంటుంది అన్న విషయం తెలిసిందే. ఒక పార్టీ గురించి మరొకరు తీవ్ర స్థాయిలో విమర్శలు గుర్తించుకుంటూ ఉంటారు. జగన్ పై పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తుండగా అదే స్థాయిలో పవన్ పై కూడా జగన్, వైసీపీ నేతలు ప్రతివిమర్శలు కూడా చేస్తున్నారు. కానీ, రెండు రకాల విమర్శలు ఒకటి కాదు. పవన్ ను రాజకీయంగా కాకుండా వ్యక్తిగతంగా జగన్ టార్గెట్ చేస్తున్నారని స్వయంగా పవన్ కళ్యాణ్ కూడా ఎన్నోసార్లు దుయ్యబట్టారు.

ఇప్పటికే ఇదే విషయాన్ని చాలా మంది టీడీపీ నేతలు కూడా ఆరోపించారు. ఈ విషయంపై పలువురు జనసేన నేతలు స్పందిస్తూ జగన్ కు రాజకీయంగా మాట్లాడేది చేతకాక పవన్ కళ్యాణ్ కావాలనే వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారు అంటూ మండిపడ్డారు. తన పెళ్లిళ్ల గురించి జగన్ కు ఎందుకని, తాను ఒకరికి విడాకులు ఇచ్చిన తర్వాతే ఇంకొకరిని పెళ్లి చేసుకున్నానని బహిరంగ సభలలో కూడా పలుమార్లు పవన్ క్లారిటీనిచ్చే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ పవన్ ను విమర్శించిన ప్రతిసారి జగన్ పవన్ మూడు పెళ్లిళ్ల గురించి ప్రస్తావన తీసుకు వస్తూనే ఉన్నారు.

 

ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ వ్యవహారంలో పవన్ కు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ బాసటగా నిలిచారు. పవన్ కు మద్దతుగా మాట్లాడిన నారాయణ జగన్ పై విమర్శలు గుప్పించారు. పవన్ మూడు పెళ్లిళ్ల గురించే జగన్ ప్రతిసారీ మాట్లాడుతున్నారంటూ నారాయణ తప్పుబట్టారు. పవన్ విడాకులు తీసుకొని మూడు పెళ్లిళ్లు చేసుకుంటే జగన్ కు వచ్చిన ఇబ్బంది ఏంటి అంటూ నారాయణ ప్రశ్నించారు. మూడు పెళ్లిళ్లు చేసుకోవడం తప్పా? లేదంటే బాబాయిని హత్య చేయడం తప్పా? అంటూ బాంబ్ పెల్చారు నారాయణ. బాబాయ్ ని చంపడం తప్పు కాదని జగన్ చెబుతారా అని నిలదీశారు. సీఎం స్థాయిని మరిచి జగన్ దిగజారి మాట్లాడుతున్నారని నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయపరంగా ఎన్ని విమర్శలైనా చేయవచ్చని, కానీ తరచుగా వ్యక్తిగత విమర్శలు, దూషణలు చేయడం, వ్యక్తిత్వ హననానికి పాల్పడడం సరికాదని హితవు పలికారు. ప్రతిపక్ష నేతలపై నిందలు వేయడం ఏంటని మండిపడ్డారు. రాజకీయంగా విమర్శించేందుకు ఏమీ లేనందునే పవన్ పై వ్యక్తిగత విమర్శలకు జగన్, వైసీపీ నేతలు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -