Crime News: గుండెల్ని పిండేసే ఘటన.. ఒకేసారి ఫ్యామిలీ మొత్తం అలా?

Crime News: కొన్ని కొన్ని సార్లు రెప్పపాటు క్షణంలో తీసుకునే నిర్ణయాలు కుటుంబాలను అలాగే జీవితాలను అతలాకుతులం చేస్తూ ఉంటాయి. ఇప్పటికే ఎంతోమంది రెప్పపాటు కాలంలో నిర్ణయాలు తీసుకొని చనిపోవడం ఇతరులను చంపడం లాంటి ఘటనలు గతంలో ఇప్పటికి ఎన్నో చోటు చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా కూడా నిజామాబాద్ జిల్లాలో ఇలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. జీవితం మీద విరక్తితో ఏకంగా కుటుంబం మొత్తం ఒకసారి ఆత్మహత్యకు పాల్పడింది. అసలేం జరిగిందంటే.. నిజామాబాద్ జిల్లాలోని ఎడపల్లి మండలం జానకంపేట. ఇదే గ్రామంలో సాయిలు,సురేఖ దంపతులు నివాసం ఉంటున్నారు.

 

ఈ దంపతులకు పెళ్లి అయ్యి చాలా ఏళ్ళు అవుతోంది. అయితే పెళ్లయిన కొంతకాలానికి ఈ దంపతులకు అరుణ్ చరణ్ అనే ఇద్దరు కుమారులు కూడా జన్మించారు. ఇద్దరు పిల్లలతో ఈ జంట కాపురం సజావుగా సాగిపోతోంది. కొంతకాలం తర్వాత కుటుంబంలో అవసరాల కోసం సాయి కొంతమంది దగ్గర అప్పులు చేశాడు. అయితే తీసుకున్న అప్పు గడియ ముగియడంతో వాళ్ళు డబ్బులు అడగడం మొదలుపెట్టారు. దీంతో అప్పు తీర్చే స్తోమత లేదు. వీళ్ళు బంధువులను మాత్రమే కాకుండా గ్రామస్తులు అందర్నీ కూడా అప్పులు అడిగారు. దాంతో అప్పులు భారం విపరీతంగా పెరిగిపోవడంతో ఆ దంపతులు తట్టుకోలేకపోయారు.

దాంతో జీవితంపై విరక్తి పుట్టి ఈ బతుకు మాకు వద్దు అనుకున్న ఆ దంపతులు ఆత్మహత్య చేసుకోవాలని పురుగుల మందు తాగి పిల్లలకు కూడా పురుగుల మందు తాపారు. వారిని గమనించిన స్థానికులు వెంటనే హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ సాయిలు మరణించాడు. అతని భార్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అయితే ఆ దంపతుల పిల్లలకు ఎటువంటి ప్రాణా హాని లేదని వారు క్షేమంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణనని చేపట్టారు.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -