Rangareddy: ఈ మధ్యకాలంలో సమాజంలో జరిగే కొన్ని సంఘటనలు తెలిస్తే భయం వేయక మానదు. కొన్ని రకాల సంఘటనలు చూస్తే వామ్మో ఇంత కిరాతకంగా హత్యలు చేస్తారా భయం కూడా వేస్తుంటుంది. ఇటీవల కాలంలో అలాంటి దారుణమైన ఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. ఎక్కడ చూసినా కూడా హత్యాచారాలు హత్యలు మానభంగాలు, ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. రాను రాను మనుషుల్లో పాపబీతి అనేది లేకుండా పోతుంది.
చిన్న చిన్న కారణాలకే ఎదుటి వ్యక్తులను దారుణంగా అతి కిరాతకంగా పొడిచి, నరికి చంపేస్తున్నారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లాలో ఒక మహిళను అతి కిరాతకంగా హత్య చేశారు. హత్య చేసిన తర్వాత ఆమె మృతదేహాన్ని గోనెసంచిలో వేసి పడేశారు. మహేశ్వరం మండలం, సర్దార్ నగర్ గేటుకు దగ్గర్లో ఈ దారుణమైన ఘటన వెలుగుచూసింది. ఈ ఘటనలో మృతి చెందిన మహిళ వయసు 35 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉంటుందని పోలీసులు గుర్తించారు.
ఈ హత్య మూడ్రోజుల కిందే జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. మహిళను మర్డర్ చేసిన తర్వాత కట్టేసి సంచిలో వేసి వెళ్లినట్లుగా చెబుతున్నారు. మృతురాలి వివరాలతో పాటు ఆమె కుటుంబసభ్యుల వివరాలను కనుగొనేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మహేశ్వరం పోలీసు స్టేషన్ పరిధిలో రీసెంట్గా ఏదైనా మహిళ మిస్సింగ్ కేసు నమోదు అయ్యిందా అన్న కూడా వాళ్ళు పరిశీలిస్తున్నారు. కాగా మహిళ డెడ్బాడీని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అయితే మృతురాలు ఎవరు ఆ కుటుంబ సభ్యులు ఎవరు? హత్య చేయడానికి గల కారణాలేంటి అనేది ఇంకా తెలియలేదు.