Dil Raju Wife: టాలీవుడ్ హీరో శర్వానంద్ ఇటీవలే ఒక ఇంటివాడైన విషయం అందరికీ తెలిసిందే. హైకోర్టు న్యాయవాది మధుసూదన్ రెడ్డి గారి అమ్మాయి రక్షితా రెడ్డిని పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లి ఘనంగా జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. ఇటీవలే జైపూర్ లో వీరి వివాహ వేడుకలు గ్రాండ్ గా జరిగాయి. అయితే పెళ్లికి కేవలం అతి కొద్దిమంది సన్నిహితులు సెలబ్రిటీలు మాత్రమే హాజరు కావడంతో తాజాగా హైదరాబాదులో గ్రాండ్గా రిసెప్షన్ ఏర్పాటు చేశారు శర్వానంద్,రక్షిత రెడ్డి. ఈ ఫంక్షన్ కి సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.
కాగా ఈ కార్యక్రమంలో రామ్ చరణ్, ఉపాసన జంట ఈ ఫంక్షన్ కి హైలైట్ గా నిలిచారు. ఎంతో స్టైలిష్ గా చాలా కూల్ అండ్ క్లాసిక్ లుక్ లో ఆకట్టుకున్నాడు చెర్రీ. అంతే కాదు ఈవెంట్ కి అమల,కేటీఆర్ కూడా హాజరై స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఇది ఇలా ఉంటే టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఆయన భార్యతో పాటు ఈవెంట్ కి హాజరయ్యారు. మామూలుగా అయితే ఇటువంటి ఈవెంట్స్ కి ఎక్కువగా దిల్ రాజు భార్య రారు. ఆమె ఎప్పుడూ హోమ్లీగా ఇంటిపట్టునే ఉంటారు. ఇప్పటివరకు ట్రెండీ మోడరన్ డ్రెస్ లో మెరిసిందే లేదు. అయితే ఫస్ట్ టైం శర్వానంద్ ఫంక్షన్ లో చాలా మోడ్రన్ దుస్తుల్లో కనిపించారు.
దీంతో సోషల్ మీడియాలో ఆమె ఫొటోస్ వైరల్ గా మారాయి. అంతేకాదు కొత్త పాత అని తేడా లేకుండా ఫంక్షన్ కి వచ్చిన ప్రతి ఒక్కరిని ప్రేమగా ఆప్యాయతగా పలకరించి దిల్ రాజు భార్య అని ప్రూవ్ చేసుకుంది. ఇకపోతే హీరో శర్వానంద్ విషయానికి వస్తే తెలుగులో ఇటీవలె ఒకే ఒక జీవితం సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. తెలుగులో రన్ రాజా రన్, శతమానం భవతి, ఆడవాళ్లు మీకు జోహార్లు, పడి పడి లేచే మనసు, మహాసముద్రం, జాను, శ్రీకారం రణరంగం, మహానుభావుడు, రాధ, ఎక్స్ప్రెస్ రాజా వంటి సినిమాలలో నటించి హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నాడు శర్వానంద్.