Sharwanand: ఆ సినిమా వల్ల అప్పులపాలైన శర్వానంద్?

Sharwanand: టాలీవుడ్ ప్రేక్షకులకు హీరో శర్వానంద్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. గమ్యం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులు పరిచయమైన శర్వా. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి నటుడుగా ఒక మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా తమిళ్ ఇండస్ట్రీలో కూడా నటుడుగా ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఇక శర్వానంద్ కి ఎక్స్ప్రెస్ రాజా సినిమా మంచి హిట్ సంపాదించి పెట్టింది. అప్పటివరకు సినిమాల పరంగా పరాజయాలు అందుకున్న శర్వానంద్ ఆ సినిమాతో గుక్క తిప్పుకున్నాడు. ఏదేమైనా శర్వానంద్ ప్రస్తుత టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడుగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక శర్వానంద్ సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటాడు.

ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అప్ డేట్స్ సోషల్ మీడియా ద్వారా పంచుకుంటాడు. ఇదిలా ఉంటే శర్వానంద్ తనకొచ్చిన కష్టాల్ని.. అప్పు వల్ల తను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి వివరించాడు. దర్శకుడు తరుణ్ భాస్కర్ తో కలిసి ఒకే ఒక జీవితం సినిమా తీసిన సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా గురించి ఒక స్పెషల్ ఇంటర్వ్యూ చేశాడు శర్వానంద్.

ఇంతకు శర్వానంద్ ఆ విధంగా అప్పులు అవడానికి కారణమైంది కో అంటే కోటి అనే సినిమా. శర్వానంద్ హీరోగా నటించిన ఈ సినిమాకి తానే స్వయంగా నిర్మాతగా వహించాడు. ఈ సినిమాలో శ్రీహరి ముఖ్యపాత్ర చేశాడు. కథను నమ్మిన శర్వానంద్ తానే స్వయంగా ఈ సినిమాకు నిర్మాతగా వహించాడు. కానీ సినిమా రిజల్ట్ విషయంలో పూర్తిగా లాస్ అయ్యింది.

కాగా శర్వానంద్ ఆ సినిమా వల్లనే చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానని తెలిపాడు. ఆ సినిమాకు నిర్మాతగా వహించడం వల్ల చాలా అప్పులు అయ్యాయని, అప్పులు తీర్చడానికి దాదాపు ఆరేళ్లు సమయం పట్టిందని చెప్పాడు. ఆ తర్వాత రన్ రాజా రన్ సినిమా హిట్ అయ్యాక ఆ అప్పులన్ని తీరిపోయాయని శర్వా చెప్పుకొచ్చాడు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -