Charmy Kaur: సినీ నటి చార్మి కౌర్ గురించి సినీ ప్రియులకు బాగా తెలుసు. ఆమె హీరోయిన్ గా చాలా సినిమాలు చేసి విజయం సాధించారు. హీరోయిన్ గా కొన్ని సినిమాలు చేశాక తన దారిని మార్చుకున్నారు. హీరోయిన్ నుంచి నిర్మాణ రంగం వైపు నడిచారు. కెరీర్ ప్రారంభంలో ఆమె ఫుల్ గ్లామర్ రోల్స్ చేస్తూ వచ్చారు. బాపుగారి బొమ్మగా ఛార్మి ఉండేవారు. కృష్ణవంశీ తీసిన శ్రీ ఆంజనేయం సినిమాలో ఒక సాంగ్ లో ఆమె చూపించిన గ్లామర్ స్టార్ హీరోలకు కూడా చెమటలు పట్టించాయి.
ఛార్మి అందం గురించి అప్పట్లో ఇండస్ట్రీలో పెద్ద టాకే నడిచింది. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి, యువరత్న బాలకృష్ణ, విక్టరీ వెంకటేశ్, కింగ్ నాగార్జునలతో ఛార్మీ నటించి మెప్పించింది. యంగ్ హీరోల సినిమాల్లో ఆమె సెకండ్ హీరోయిన్ గా కూడా నటించింది. బాపు మరణానికి ముందుగా ఛార్మితో కలిసి ఓ సినిమా కూడా చేశారు. అప్పటి నుంచి ఆమె బాపు బొమ్మగా పిలువబడ్డారు. వాటితో పాటుగా హర్రర్ సినిమాల్లో కూడా ఛార్మి నటించి మెప్పించారు.
హీరో శివాజితో కలిసి మంత్ర అనే సినిమాలో ఛార్మి నటించారు. ఆ సినిమాలో ఆమె ప్రేక్షకులను ఎంతగానో భయపెట్టారు. ఆ తర్వాత జ్యోతిలక్ష్మి విషయానికి వస్తే అందులో ఆమె వేశ్య పాత్రలో చేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఈ సినిమా కూడా ఆమెకు చాలా మంచి గుర్తింపును తెచ్చింది.
లైగర్ సినిమాకు ఆమె నిర్మాతగా వ్యవహరించారు. అయితే ఆ సినిమా డిజాస్టర్ కావడంతో అప్పుల్లో నుంచి బయటపడేందుకు సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాలని అనుకుంటున్నారు. ప్రస్తుతం ఆ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినిమాల్లో తల్లి, అత్త, ఇలా ఎలాంటి పాత్రల్లోనైనా చేసేందుకు ఛార్మి ముందకు వస్తుండటం విశేషం. పెళ్లి చేసుకోకుండానే మదర్ క్యారెక్టర్ కు ఛార్మి పడిపోయిందా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.