Pawan Kalyan: జనసేన ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా కోసం అభిమానులు ఎంతగా ఎదురు చూస్తారో తెలిసిందే. జూలై 28న బ్రో రిలీజ్ అవ్వబోతుండగా మరొక మూడు సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. ఒకటి క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు కాగా మరొకటి హరీష్ శంకర్ డైరెక్షన్లో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్.
ఇప్పటికే బడ్జెట్ కారణంగా హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ ఆగిపోయింది. ఇక భగత్ సింగ్ కూడా పవన్ కళ్యాణ్ ఎన్నికల హడావుడిలో బిజీగా ఉండడం వల్ల ఈ సినిమా షూటింగ్ కూడా జరగడం కష్టమేం అంటున్నారు సినీ వర్గాల వారు. నిజానికి 2019లో గద్దల కొండ గణేష్ మూవీ తర్వాత మరో సినిమా చేయకుండా పవన్ తోనే సినిమా కోసం చేయటానికి వెయిట్ చేసాడు హరీష్ శంకర్. అలాంటిది పవన్ కళ్యాణ్ ఈ సినిమా ఆపేసి అటు డైరెక్టర్ తో పాటు ఇటు ఫ్యాన్స్ కి కూడా పెద్ద షాక్ ఇచ్చాడు.
అయితే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా తర్వాత అనౌన్స్ చేసిన OG మూవీ ఇప్పటికే నాలుగు షెడ్యూలు కంప్లీట్ చేసుకుంది. మరొక 22 రోజులు షూటింగ్లో పాల్గొంటే పవన్ పోర్షన్ అయిపోతుంది అంటున్నారు మూవీ మేకర్స్. దీంతో పవన్ కళ్యాణ్ O G మూవీ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అంటూ రూమర్స్ వినబడుతున్నాయి.
అయితే హరీష్ శంకర్ మాత్రం ఈ సమయంలో ఖాళీగా ఉండకుండా రవితేజతో హిందీ సినిమా రైడ్ ను రీమేక్ చేస్తారని పీపుల్స్ మీడియా సంస్థ నిర్మిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి ఈ సినిమా సంక్రాంతిలో విడుదలవుతుందని బయట టాక్. అలాగే హరిహర వీరమల్లు డైరెక్టర్ క్రిష్ ని కూడా ఎన్నికల అదృష్ట తాను బిజీగా ఉండటం వలన మరొక సినిమా చేసుకోమన్నట్లు సమాచారం. మరి క్రిష్ ఏం చేస్తారు చూడాలి.