SaiTej: సింపతీ వల్ల సాయితేజ్ కు సక్సెస్ దక్కిందా.. ఏం జరిగిందంటే?

SaiTej: టాలీవుడ్ హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన విరూపాక్ష సినిమా, అలాగే సమంత నటించిన శాకుంతలం సినిమాలు కేవలం వారం రోజుల గ్యాప్ లోనే థియేటర్లలో విడుదలైన సంగతి మనందరికీ తెలిసిందే.. రెండు కూడా భారీ అంచనాల నడుమ విడుదల కాగా అందులో శాకుంతలం సినిమా డిజాస్టర్ గా నిలిచింది. సాయి నటించ విరూపాక్ష సినిమా విడుదల అయ్యి సూపర్ హిట్ టాక్ ని అందుకుంది. ఒక సినిమా సక్సెస్ అయ్యి మరో సినిమా ఫ్లాప్ కావడంతో సమంతకు పని చేయని సింపతి సాయి ధరమ్ తేజ్ కీ పని చేసింది అంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.

సమంత గత కొంతకాలంగా మాయోసైటీస్ అనే వ్యాధితో బాధపడుతూ ఈ మధ్యకాలంలో పూర్తిగా కోలుకున్న సంగతి మన అందరికి తెలిసిందే. అయితే అనంతపూర్ పూర్తిస్థాయిలో కోలుకోలేదు అని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తుండగా కోలుకుంది కానీ సినిమా ప్రెషన్స్ లో కావాలనే అలా నాటకాలు వాడింది అంటూ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. కాగా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సమంత సింపతీ కోసం ప్రయత్నించినా శాకుంతలం సినిమా ఆమెకు మరో భారీ షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే సాయితేజ్ కూడా తన యాక్సిడెంట్ గురించి, ఇతర విషయాల గురించి చెప్పుకొచ్చారు.

 

సాయితేజ్ కు మాత్రం సింపతీ వర్కౌట్ అయింది. విరూపాక్ష మూవీకి 24 కోట్ల రూపాయల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. సాయితేజ్ రెమ్యునరేషన్ ప్రస్తుతం 5 నుంచి 6 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. విరూపాక్ష సినిమాలో సాయితేజ్ కు జోడీగా సంయుక్తా మీనన్ హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -