Samantha: వాళ్లను విడగొట్టిన పాపం సమంతకే తగిలిందా?

Samantha: ప్రస్తుతం సమంత టాలీవుడ్ లో పాన్ ఇండియా స్టార్ గా ఓ వెలుగు వెలుగుతుంది. బాలీవుడ్ లో కూడా అడుగు పెట్టిన సమంత పలు ఆఫర్లు అందుకొని ప్రస్తుతం షూటింగ్ నేపథ్యంలో బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది. అటు హాలీవుడ్ లో కూడా ఒక సినిమా ఆఫర్ సమంత దక్కించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా సమంత విడాకులైన అనంతరం కేరీర్ పరంగా ఒక రేంజ్ లో దూసుకుపోతుంది.

అయితే సమంత విడాకులు తర్వాత చాలా రూమర్లను ఎదుర్కొంది. తనకి వేరే ఒక వ్యక్తితో రిలేషన్షిప్ ఉందని అందుకోసమే నాగచైతన్యతో విడాకులు తీసుకుందని అప్పట్లో బాగా ప్రచారాలు జరిగాయి. కానీ ఈ ప్రచారాల్లో నిజం ఎంతో తెలియదు. కానీ సమంత కూడా ఈ పుకార్లను ఏమాత్రం పట్టించుకోకుండా.. తన పని తాను చేసుకుంటూ వెళ్ళింది. ఇదిలా ఉంటే తాజాగా సమంత గురించి మార్కెట్లోకి ఒక కొత్త గాసిప్ బయటకు వచ్చింది. అదేమిటంటే..

అక్కినేని నాగార్జున మేనకోడలు సుప్రియ మనందరికీ తెలిసిందే. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన సుప్రియ ఆ తర్వాత మరి ఏ సినిమాలో కనిపించలేదు. ఇక సుప్రియ ఒక లవ్ స్టోరీ నడిపిందని అప్పట్లో వార్తలు వినిపించాయి. గతంలో యంగ్ హీరో అడవి శేషుతో సుప్రియ రాసుకొని పూసుకొని తిరిగేది. దీంతో వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమకు అక్కినేని ఫ్యామిలీ కూడా ఓకే చెప్పిందని వార్తలు వచ్చాయి.

కానీ వీళ్ళిద్దరి పెళ్లికి సమంత అడ్డుకుందని తెలిసింది. మొదటినుంచి సుప్రియకి సమంతకీ పెద్దగా పడదట. అడివి శేషుకు, సుప్రియ కు వర్క్ అవుట్ అవ్వదని అక్కినేని ఫ్యామిలీతో సమంత చెప్పి వారిద్దరి పెళ్లిని చెడగొట్టిందట. దాంతో సుప్రియ అప్పటినుంచి ఒంటరిగా మిగిలిపోయింది. ఇక తాజాగా సమంత నాగచైతన్యలు పూర్తిగా వారి బంధానికి బ్రేక్ అప్ చెప్పుకున్నారు. ఇలా వీళ్ళిద్దరూ విడిపోవడానికి కారణం.. సుప్రియ ఉసురు గట్టిగా తగిలిందని కొందరు అనుకుంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -