Alekhya Reddy: తారకరత్న భార్య అత్తామామల గురించి అలాంటి కామెంట్లు చేశారా?

Alekhya Reddy: టాలీవుడ్ తెలుగు హీరో నందమూరి తారకరత్న ఇటీవలే మరణించిన తెలిసిందే. తారకరత్న మరణంతో ఒక్కసారిగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో అలాగే నందమూరి ఫ్యామిలీలో విషాదఛాయలు అలుముకున్నాయి. తారకరత్న మరణాన్ని అభిమానులు అలాగే కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికీ తారకరత్న మరణించినది కలగానే ఉంది అని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నందమూరి ఫ్యామిలీ విషయానికొస్తే ఇప్పటికే తారకరత్న చిన్న కర్మ పెద్ద కర్మ కార్యక్రమాలు పూర్తి చేసిన విషయం తెలిసిందే.


కాగా తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి తన భర్త మరణాన్ని జీర్ణించుకోలేకపోతోంది. తరచూ తన భర్తతో గడిపిన క్షణాలను తలుచుకుంటూ అందుకు సంబంధించిన ఫోటోలను ,వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. అయితే భర్తే ప్రపంచంగా బతుకుతున్న అలేఖ్య రెడ్డికి ఒక్కసారిగా భర్త తిరిగిరానంత దూరం వెళ్లిపోవడంతో ఆ విషయాన్ని జీర్ణించుకోలేకపోతోంది. అభిమానులు ఆమెకు దైర్యం చెబుతూ ఆ దేవుడు కొండంత ధైర్యాన్ని మీకు ఇవ్వాలని కోరుకుంటున్నాము అంటూ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే తారకరత్నకు సంబంధించిన మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అదేమిటంటే తాజాగా అలేఖ్య రెడ్డి తన ఇంస్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసిన స్టోరీ ప్రస్తుతం సంచలనంగా మారింది. తారకరత్న తనకు ఆఖరిగా రాసిన లేఖను పోస్ట్ చేస్తూ జీవితంలో నువ్వు నేను ఎన్నో కష్టాలను అవమానాలను ఎదుర్కొన్నాము. చివరికి వాటన్నింటినీ ఎదుర్కొని ఒక చిన్న కుటుంబాన్ని ఏర్పరచుకున్నాము. ఇకపై మనం ప్రశాంతంగా ఉండవచ్చు అని ఎన్నో కలలు కన్నాము. ఇంతలోనే ఇదంతా జరిగిపోయింది. నిన్ను నీ కుటుంబ సభ్యులు సరిగా అర్థం చేసుకోలేకపోయారు. కానీ నేను నిన్ను అర్థం చేసుకున్నందుకు సంతోషపడుతున్నాను అని రాసుకొచ్చింది అలేఖ్య రెడ్డి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -