NTR: టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోగా నందమూరి ముద్దుబిడ్డ జూనియర్ ఎన్టీఆర్ కొనసాగుతున్నాడు. అద్భుతమైన తన నటనతో ఏ ప్రాతైనా అలవోకగా చేసేస్తాడు. సింగిల్ టేక్ ఆర్టిస్ట్గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఆయన కెరీర్ ఆర్ఆర్ఆర్కు ముందు ఆర్ఆర్ఆర్ తర్వాత అనేలా ఆ సినిమాలో నటించాడు. దీంతో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. విదేశాల్లో క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఓ రెండు భారీ ప్రాజెక్టుల్లో నటించటానికి తారక్కు ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది.
జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్గా వెలిగిపోతున్నాడు. నార్త్, సౌత్ అనే తేడా లేకుండా చేసుకున్నాడు. పైగా చేయబోతున్న మూవీస్ కూడా పాన్ ఇండియా లెవెల్లోనే ఉంటాయని ప్రచారం జరుగుతోంది. కొత్త కథలు కూడా ఆ స్థాయిలో ఉంటేనే సైన్ చేస్తున్నట్లు తెలిసింది. తాజాగా కొరటాల శివతో చేయబోతే మూవీ సైతం పాన్ ఇండియా లెవెల్లోనే ఉంటుందని టాలీవుడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ మూవీలో ఇప్పటికే ఆర్టిస్టులను సైతం వివిధ ఇండస్ట్రీల నుంచి సెలెక్టు చేశారు. ఆర్ఆర్ఆర్ మూవీతో హాలివుడ్కు సైతం యంగ్ టైగర్ పరిచయం అయ్యాడు.
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు బడ్జెట్ను కొంత మేరకే పరిమితం చేశారు. ఇప్పుడు మాత్రం అలా కాదు. ఎన్నికోట్లు ఖర్చు పెట్టేందుకైనా ఈ ప్రొడ్యూజర్లు వెనుకాడటం లేదు. అందుకే తారక్తో రెండు సినిమాలు చేస్తున్న ఓ టాలీవుడ్ నిర్మాణ సంస్థ ఏకంగా ఆయనకు 400 కోట్లుకు డీల్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇంత పెద్ద అమౌంట్ ఇదే ప్రధమని కూడా టాక్ వినిపిస్తోంది. ఇది విన్న టాలీవుడ్ ఇండస్ట్రీలోని కొందరు సైతం నోరెల్లబెట్టారట. ఆయన ఫ్యాన్స్ మాత్రం మా హీరో రేంజ్ అది అని మురిసిపోతున్నారు.