Mahesh: మహేష్ సినిమా నిర్మాతలకు ఏకంగా అన్ని రూ.కోట్లు వచ్చాయా?

Mahesh: మహేష్ బాబు.. ఆ పేరులోనే ఒక వైబ్రేషన్ ఉంది.ఆ వైబ్రేషన్ తోనే బాక్సాఫీస్ ని పరుగులు పెట్టిస్తున్నాడు మహేష్ బాబు. సంచలనాలు సృష్టించటం మహేష్ బాబుకి కొత్త ఏమీ కాదు అయితే ఇప్పుడు తాజాగా గుంటూరు కారంతో మరొక సంచలనానికి తెర తీశాడు మహేష్ బాబు. అరుదైన రికార్డుని సొంతం చేసుకుని సూపర్ స్టారా మజాకా అనిపించుకుంటున్నాడు. ఇక అసలు విషయానికి వస్తే తాజాగా త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కలిపి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకులు ముందుకు వస్తున్నాడు మహేష్ బాబు.

 

హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై చిన్నబాబు, నాగవంశీ నిర్మించిన ఈ సినిమా ఇప్పటికే భారీగా అడ్వాన్స్ బుకింగ్ సొంతం చేసుకుంటుంది. ఈ బుకింగ్స్ రికార్డు స్థాయిలో ఉండటం గమనార్హం. అయితే మహేష్ బాబు నటించిన గత ఐదు సినిమాల తొలిరోజు కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూసినట్లయితే స్పైడర్ చిత్రం 16 కోట్ల షేర్ వసూలు చేసింది. తర్వాత భరత్ అనే నేను 23.5 కోట్లు కలెక్ట్ చేసింది ఇక మహర్షి సినిమా విషయానికి వస్తే 24.5 కోట్లు.

సరిలేరు నీకెవ్వరు 32.7 కోట్లు సర్కారు వారి పాట 36 కోట్లు వసూలు చేసింది. ఇక వరల్డ్ వైడ్ గా ఈ సినిమాలో మొదటి రోజు ఎంత వసూలు చేశాయో చూసినట్లయితే స్పైడర్ చిత్రం మొదటి రోజు 24.5 కోట్ల షేర్ 42.8 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది భరత్ అనే నేను ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు 33.9 కోట్లు షేర్, 53.8 కోట్ల గ్రాస్ రాబట్టింది. మహర్షి చిత్రం 31.8 కోట్ల షేర్ 48 కోట్ల గ్రాస్.సరిలేరు నీకెవ్వరు 33.5 8 కోట్ల షేర్ 53 కోట్ల గ్రాస్ ఇక సర్కారు వారి పాట చిత్రం 4.8 కోట్ల షేర్ 63.5 కోట్ల గ్రాస్ రాబట్టింది.

 

ఇక గుంటూరు కారం సినిమా విషయానికి వస్తే అడ్వాన్స్ బుకింగ్ రికార్డు స్థాయిలో జరుగుతుంది ఈ చిత్రం 65 కోట్లకు పైగా ఫస్ట్ డే గ్రాస్ నమోదు చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి ఇక ప్రి రిలీజ్ విషయానికి వస్తే 132 కోట్ల రూపాయలు బిజినెస్ జరిగింది. దీంతో ఐదు చిత్రాలకే కలిపి 551 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది దీంతో తెలుగు సినీ చరిత్రలోనే ఇంత పెద్ద మొత్తంలో బిజినెస్ చేసిన ఏకైక రీజనల్ హీరోగా మహేష్ బాబు అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -