Sr NTR: సీనియర్ ఎన్టీఆర్ ను మోసం చేసిన వాళ్లకు అలాంటి గతి పట్టిందా?

Sr NTR: వెండితెర కృష్ణుడు, నవరస నటనా సార్వభౌముడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఆయనకు సంబంధించిన ఏదో ఒక వార్త వెలుగులోకి వస్తూనే ఉంది. ఆ మధ్య అంత ఉత్సవాలకి
రావద్దంటూ బెదిరించారని బాలయ్యని, ఆహ్వానించే పద్ధతి సరిగ్గా లేదని టీడీపీ పార్టీని దుమ్మెత్తి పోసారు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు.

అలాగే ఇప్పుడు మరొక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇంతకీ విషయం ఏమిటంటే ఒకప్పుడు ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచిన ప్రతి ఒక్కరూ ఆ కర్మని అనుభవిస్తున్నారని అందరూ అసహజ మరణాన్ని పొందుతున్నారని కచ్చితంగా ఎన్టీఆర్ ఉసురు తగిలిందని అందుకే వాళ్ళందరికీ అలాంటి గతి పట్టిందని చెప్పుకొస్తున్నారు నందమూరి అభిమానులు.

 

అందుకు సాక్షులను కూడా చూపెడుతున్నారు. ఆ రోజుల్లో ఎన్టీఆర్ ని తీవ్రంగా విమర్శించే పత్రికలు ఈనాడు, ప్రభ, ఆంధ్రజ్యోతి. అవి ఆ రోజుల్లో ఎంత వైభోగాన్ని చూసాయో నేడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాయో మనం కళ్ళారా చూస్తూనే ఉన్నాం. రామోజీరావు అంతటివాడు మంచం మీద పడుకొని వీడియో చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక జ్యోతి, ప్రభ పత్రికలని అదే కంపెనీలో పనిచేస్తున్న వారికి అమ్ముకున్నారు ఆ కంపెనీ ఓనర్స్.

 

ఇక మామ కి చుక్కలు చూపించిన చంద్రబాబు మరోమారు ఆ పీఠంపై కూర్చోవడం అనుమానమే. అన్నగారి వెన్నుపోటు కి కారణమైన నందమూరి కుటుంబ సభ్యులకి కూడా ఆయన ఉసిరి తగరడం వల్లే అకాల మరణం చెందుతున్నారు. అప్పుడు చంద్రబాబు నాయుడు వెంట కీలకంగా ఉన్న వ్యక్తి ఎర్రమనాయుడు ఆయన ఎలా మరణించారు కూడా మనకి బాగా తెలిసిందే. అలాగే అకాల మరణం పాలైన మరి కొంతమంది చంద్రబాబు నాయుడు అనుచరులు బాలయోగి, మాధవరెడ్డి, హరికృష్ణ కూడా అన్నగారి ఉసురు తగలటం వల్లనే పోయారు అనేది అన్నగారి అభిమానుల వాదన.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -