SaiTej: టాలీవుడ్ యంగ్ హీరో సాయి ధరమ్తేజ్ గురించి మనందరికీ తెలిసిందే. మెగా మేనల్లుడుగా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సాయి ధరమ్ తేజ్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నాడు. నటించినది తక్కువ సినిమాలే అయినప్పటికీ హీరోగా మంచి ఫ్యాన్స్ బేస్ ని ఏర్పరచుకున్నాడు సాయి ధరమ్తేజ్. ఇకపోతే సాయి ధరమ్తేజ్ ఇటీవల విరూపాక్ష సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా
సూపర్ హిట్ గా నిలిచింది.
చాలా కాలం తర్వాత సాయి ధరమ్తేజ్ ఈ సినిమాతో ఒక సూపర్ హిట్ సినిమాను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం సాయిధరమ్ మేనమామ పవన్ కళ్యాణ్ తో చేస్తోన్న మల్టీస్టారర్ మూవీ బ్రో. ఈ సినిమా షూటింగ్లో భాగంగా బిజీ బిజీగా ఉన్నాడు. సాయి తేజ్ తమ్ముడు వైష్ణవ్తేజ్ ఉప్పెన సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే భారీగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత నటించిన రెండు సినిమాలు కూడా ఊ హించిన విధంగా సక్సెస్ కాలేకపోయాయి. ఇప్పుడు వైష్ణవ్ తేజ్ శ్రీలీలతో ఆదికేశవ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా హిట్ తన ఖాతాలో వేసుకోవాలని ప్రయత్నిస్తున్నాడు.
ఈ అన్నదమ్ముల ఫ్యామిలీ లైఫ్ విషయానికి వస్తే.. వైష్ణవ్ తేజ్, సాయి ధరమ్తేజ్ కలిసి వారి తల్లికి దగ్గరుండీ మరీ రెండో వివాహం చేశారట. మెగాస్టార్ చిరంజీవి చెల్లి విజయదుర్గకు మొదట్లో శివప్రసాద్ అనే వ్యక్తి వ్యక్తితో వివాహం అయ్యింది. తర్వాత కొంతకాలానికి ఏవో మనస్పర్ధలు కారణంగా వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. తర్వాత విజయదుర్గ ఒక్కరే తన ఇద్దరు కొడుకులు సాయి ధరమ్తేజ్, వైష్ణవ తేజ్ ను కష్టపడి పెంచింది. వారి కోసం తన జీవితాన్ని చాలా వరకు త్యాగం చేసింది.
తన కొడుకుల కోసం ఒంటరిగా జీవితాన్ని గడుపుతూ ఇద్దరిని పెంచిన విజయదుర్గకు ఈ వయస్సులో ఒక తోడు ఉండాలని కొడుకులే నిర్ణయం తీసుకున్నారట. ఎలాగైనా తమ అమ్మకు మళ్లీ వివాహం చేయాలని వైష్ణవ్తేజ్, సాయి ధరంతేజ్ గట్టి నిర్ణయం తీసుకున్నారట. దీంతో విజయదుర్గను ఒప్పించి దగ్గరుండి కేర్ హాస్పిటల్ కు చెందిన ఒక డెంటిస్ట్ కి ఇచ్చి వివాహం చేశారట.