Naresh-Pavitra Lokesh: పవిత్ర నరేష్ ను వదిలేసిందా.. ఇద్దరి మధ్య దూరం పెరిగిందా?

Naresh-Pavitra Lokesh: ఇండస్ట్రీ నుంచి పెళ్లి వార్త వచ్చిందంటే చాలు అది నరేష్ కు సంబంధించిందా అని అడిగేస్తున్నారు అందరూ. ప్రస్తుతం ఘట్టమనేని నరేష్ పెళ్లిపై ప్రస్తుతం జోరుగా చర్చ జరుగుతోంది. ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్న నరేష్.. ఇప్పుడు నాలుగో పెళ్లికి రెడీ అవుతున్నాడనేది సర్వత్రా చర్చనీయాంశమైంది. నటి పవిత్రా లోకేష్‌తో ఆయన రొమాన్స్ అనేక వివాదాలకు దారి తీస్తోంది. ఒకవైపు నరేష్-పవిత్ర లోకేష్ పెళ్లికి సిద్ధమని హింట్ ఇస్తూనే మరోవైపు నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి మాత్రం నరేష్ తో విడాకులు తీసుకునే ప్రసక్తే లేదని అంటున్నారు.

ఇదే అంశంపై కోర్టుకు హాజరైన నరేష్ రమ్యపై సంచలన వ్యాఖ్య చేశాడు. ఆమె వల్ల ప్రాణభయం ఉందని నరేష్ చెప్పాడు. 2010 మార్చి 3న రమ్యను పెళ్లి చేసుకున్నానని చెప్పిన నరేష్ కట్నం కూడా తీసుకోలేదని చెప్పాడు. అయితే పెళ్లయిన కొన్ని నెలలకే రమ్య నుంచి వేధింపులు మొదలయ్యాయని నరేష్ చెప్పాడు. కొంతమంది తమ పేర్లు తెలియకుండా బ్యాంకుల నుంచి డబ్బులు పొందారని నరేష్ కోర్టుకు తెలిపారు. నన్ను చంపేందుకు రమ్య గ్యాంగ్‌తో కలిసి సుపారీ ఇచ్చింది. నేను ప్రమాదంలో ఉన్నాను. చంపేస్తామనే భయంతో ఒంటరిగా ఎక్కడికీ వెళ్లడం లేదని నరేష్ చెప్పాడు.

 

మరోవైపు పవిత్ర లోకేష్‌కి సంబంధించిన కొన్ని విషయాలపై నెటిజన్లు వెతుకుతున్నారు. గతంలో తన భర్త సుచేంద్రప్రసాద్ గురించి ఆమె చెప్పిన మాటలు ఇప్పుడు వార్తల్లో నిలిచాయి. ఆ సమయంలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో పవిత్ర లోకేష్ మాట్లాడుతూ సుచేంద్రప్రసాద్ దేవుడు నాకు ఇచ్చిన వరం. సీరియల్‌లో నటిస్తూనే వీరి మధ్య ఏర్పడిన స్నేహం ప్రేమగా మారి పెళ్లి చేసుకున్నారు. అయితే ఇప్పుడు నరేష్‌ని పెళ్లి చేసుకోవడానికి పవిత్ర లోకేష్ సిద్ధపడడం చూసి అభిమానులు షాక్ అవుతున్నారు. డబ్బు కోసం పవిత్ర నరేష్‌ను వెంబడించిందని రమ్య రఘుపతి ఆరోపించింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -