Dil Raju: దిల్‌రాజు చేస్తున్న ఈ పని గురించి తెలిస్తే షాకవ్వాల్సిందే?

Dil Raju: ప్రస్తుతం టాలీవుడ్ దిగ్గజ నిర్మాతల్లో దిల్‌రాజు ఒకరు. నైజాం ప్రాంతంలో డిస్ట్రిబ్యూటర్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన దిల్ రాజ్.. ఇప్పుడు ఇండస్ట్రీనే ఏలే పొజిషన్‌కు ఎదిగాడు. వి.వి.వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ‘దిల్’ అనే సినిమాతో తొలిసారిగా నిర్మాతగా పరిచయం అయ్యాడు. ఈ సినిమాల్లో అప్పట్లో సెన్సేషనల్ హిట్ అయింది. అప్పటివరకు రాజుగా ఉన్న అతడి పేరుకు దిల్ యాడ్ అయింది. తొలి సినిమా సక్సెస్‌తోనే దిల్ రాజుగా పేరు వచ్చింది. ఇప్పటివరకు టాలీవుడ్‌లో స్టార్ హీరోల దగ్గరి నుంచి కుర్ర హీరోల వరకు ప్రతి ఒక్కరితో సినిమాలు తీసి.. బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. దిల్ రాజు ఒక సినిమా స్టోరీని ఓకే చేశాడంటే.. అది కచ్చితంగా హిట్ అవ్వాల్సిందే. అలాంటి ట్రాక్ రికార్డ్ కేవలం దిల్ రాజుకే సొంతం.

 

 

సినిమా స్టోరీ వినే సక్సెస్ అవుతుందా? లేదా? ఎంత వసూళ్లు రాబడుతుంది? అని దిల్ రాజు చెప్పేయగలడు. అందుకే దిల్ రాజు మార్కెట్‌లో ఒక బ్రాండ్‌ మారాడు. ఓ వైపు నిర్మాతగా రాణిస్తూనే.. మరోవైపు తన కెరీర్‌కు మూలకారణమైన డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థను వదులుకోలేదు. ఇప్పటికీ నైజాం, ఉత్తరాంధ్ర, కృష్ణా జిల్లాల్లో డిస్ట్రిబ్యూటర్‌గా కొనసాగుతున్నాడు. అయితే దిల్‌ రాజు ఒక సినిమా కొన్నాడంటే.. ఆ సినిమా కచ్చితంగా హిట్ కొడుతుందని పక్కా నమ్మకం. తాజాగా దిల్‌రాజు తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ‘లవ్ టుడే’ సినిమాను తెలుగులో డబ్ చేసి విడుదల చేశారు. ఈ సినిమాను కేవలం రూ.2 కోట్లకే కొనుగోలు చేయగా.. రూ.8కోట్లు లాభాన్ని ఆర్జించాడు. ఈ సినిమా ద్వారా ప్రదీప్ రంగనాథం, ఇవానా హీరో హీరోయిన్లుగా పరిచయమై.. మంచి క్రేజ్ తెచ్చుకున్నారు.

 

 

ఈ సినిమాలో ముఖ్యంగా హీరోయిన్ ఇవానాకు యూత్‌లో మంచి క్రేజ్ వచ్చింది. ఆ విషయాన్ని దిల్ రాజు గమనించాడు. దాంతో ఆమెను తన ఆస్థాన హీరోయిన్‌గా పెట్టుకోవడానికి ట్రై చేస్తున్నాడట. దిల్ రాజు నిర్మాణంలో వచ్చే వరుస సినిమాల్లో హీరోయిన్‌గా నటించేందుకు ప్లాన్ చేస్తున్నాడట. ఇందుకోసం మొదటి సినిమాకు రూ.కోటి పారితోషికం కూడా ఇవ్వడానికి దిల్ రాజు ఆఫర్ చేసినట్లు సమాచారం. దానికి ఇవానా కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. కాగా, తమిళంలో సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లు చేసి పాపులర్ అయిన ఇవానా తన మొదటి సినిమాతోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -