Poorna: పూర్ణ ఒకప్పుడు వరుస సినిమాలతో టాలీవుడ్లో దూసుకుపోయింది. అయితే ఆమెకు వెండితెరపై మాత్రం అంతగా స్టార్డం రాలేదు. కానీ బుల్లితెరపై మాత్రం పూర్ణ ఓ రేంజ్లో ఫేమస్ అయింది. ఢీ షోలో జడ్జ్గా వచ్చిన పూర్ణ.. అక్కడ చేసిన చేష్టలతో ఎక్కువగా ట్రోలింగ్కు గురైంది. అలా జనాల్లో ఎక్కువగా నానుతూ వచ్చింది. బుగ్గలు కొరకడం, హగ్గులు ఇవ్వడంతో పూర్ణ ఎక్కువగా సోషల్ మీడియాలో వైరల్ అయింది.
పూర్ణ టాలీవుడ్ లోకి ‘శ్రీ మహాలక్ష్మి’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. సీమటపాకాయ్ చిత్రం పూర్ణకి టాలీవుడ్ లో మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. ఆ మధ్య పూర్ణ మొత్తంగా సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చింది. గతేడాది చివర్లో వచ్చిన బాలయ్య అఖండ సినిమాలో కథలో కీలక పాత్రలో కనిపించింది. అయితే ఇప్పుడు మాత్రం పూర్ణ వరుసగా సినిమాల్లో నటించేస్తోంది. బుల్లితెరపై, వెండితెరపై ఫుల్ బిజీగా ఉంటోంది.
అందరి హీరోయిన్ల లాగే పూర్ణపై కూడా కొన్ని రూమర్స్ వచ్చాయి. చిత్ర పరిశ్రమలో దర్శకులు, హీరోలు, హీరోయిన్లపై రూమర్లు సహజంగానే పుట్టుకొస్తుంటాయి. రవిబాబు దర్శకత్వంలో హీరోయిన్ పూర్ణ మూడు చిత్రాల్లో నటించింది. అవును, అవును 2, లడ్డుబాబు చిత్రాల్లో రవిబాబు.. పూర్ణకు అవకాశం ఇచ్చారు. అలా మూడు సినిమాలు ఒకే దర్శకుడితో చేయడంతో రూమర్లు రావడం సహజం.
అయితే వీటిపై రవిబాబు ఓ ఇంటర్వ్యూలో స్పందించాడు. తనకు హీరోయిన్ల సంబంధం ఉండదని అన్నారు. షూటింగ్ తరవాత వారికి ఫోన్ కూడా చేయను అని చెప్పారు. తనపై వస్తున్న వార్తల్లో నిజం లేదని…పూర్ణ నటన చూసి ఆమెకు మూడు సినిమాల్లో అవకాశం ఇచ్చానని పేర్కొన్నారు.నేను హీరోయిన్స్ వెనక పడడం నిజమైతే నా సినిమాలు ఏ హీరోయిన్ కూడా చేయదు అని చెప్పుకొచ్చాడు.