Soundarya: స్టార్ హీరోయిన్ సౌందర్య చివరి కోరిక ఏంటో మీకు తెలుసా?

Soundarya: సౌత్ ఇండస్ట్రీలో సహజ నటిగా చెరగని ముద్ర వేసుకున్న సౌందర్య గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మహానటి సావిత్రి తర్వాత అంతటి గుర్తింపు పొందిన ఏకైక హీరోయిన్ సౌందర్య. ఎక్స్పోజింగ్ కి దూరంగా ఉంటూ తన అద్భుతమైన నటనతో ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ఇలా దాదాపు 15 సంవత్సరాల పాటు సౌత్ ఇండస్ట్రీలో నంబర్ వన్ హీరోయిన్ గా కొనసాగిన సౌందర్య 2004లో ప్రమాదవశాత్తు మరణించింది.

బీజేపీ సీనియ‌ర్ నేత విద్యాసాగ‌ర్ రావు ఎన్నిక‌ల ప్ర‌చారానికి బెంగ‌ళూరు నుంచి క‌రీంన‌గ‌ర్ వ‌స్తుండ‌గా 17 ఏప్రిల్ 2004న విమాన ప్రమాదంలో సౌంద‌ర్య‌ మరణించింది. సౌందర్య మరణం ఇండస్ట్రీలో తీరని లోటుని మిగిల్చింది. ఆమె మరణించిన తర్వాత ఆమె లేని లోటుని ఎవరూ పూడ్చలేకపోతున్నారు. సౌందర్య భౌతికంగా మన మధ్య లేకపోయినప్పటికీ ఆమె నటించిన సినిమాల ద్వారా ఎప్పుడు అభిమానుల మనసులో చిరస్థాయిగా నిలిచిపోయింది.

 

ఇలాంటి గొప్ప నటి అయిన సౌందర్య తన ఆఖరి కోరిక తీరకుండానే మరణించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె మరణించిన సమయంలో సౌందర్య ఆఖరి కోరిక గురించి ఆమె మేనకోడలు చెప్పిన మాటలు ఇప్పుడు బయటికి వచ్చాయి. విమాన ప్ర‌మ‌దానికి ముందు త‌న మేన‌కోడ‌లిని సౌందర్య రెండు కోరిక‌లు కోరార‌ట‌. తనకి కాటన్ చీరలు లేకపోవటంతో తనకోసం కొన్ని కాట‌న్ చీర‌లు, కుంకుమ కొనాల‌ని మేనకోడలికి చెప్పిందట.

 

త‌న కోడ‌లు కూడా బీజేపీలో చేర‌డంతో ఎన్నిక‌ల ప్ర‌చారంలో కాట‌న్ చీర‌లు ధరించి ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొనాల‌ని సూచించింద‌ట‌. ఇలా కాటన్ చీరలు కొనమని కోడలికి చెప్పి ప్రచారం కోసం బయలుదేరిన సౌందర్య అలా వెళ్లిన కొద్ది సేప‌టికే హెలీకాఫ్ట‌ర్ ప్రమాదంలో తుది శ్వాస విడిచింది. సౌందర్య మరణం ఆమె కుటుంబంతో పాటు ఇండస్ట్రీలో కూడా తీరని లోటుని మిగిల్చింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -