Vijayashanthi: విజయశాంతి కొడుకు గురించి ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?

Vijayashanthi: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో హీరోలకు అధిక ప్రాధాన్యత ఉంటుంది.కేవలం హీరోయిన్లు వారి పక్కన రొమాంటిక్ సన్నివేశాలలో నటించడానికి లేదా సాంగ్స్ కోసం హీరోయిన్లను తీసుకుంటున్నటువంటి సందర్భాలు ప్రస్తుత సినిమాలలో చోటు చేసుకుంటున్నాయి. అయితే ఒకప్పటి సినిమాలలో హీరోయిన్ల పాత్రలకు కూడా ఎంతో మంచి ప్రాధాన్యత ఉండేది. సినిమాలలో హీరోయిన్లకు కూడా చాలా ఎక్కువ నిడివి ఉన్న సన్నివేశాలను ఇచ్చేవారు.

ఒకప్పుడు హీరోలతో పాటు సమానంగా సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో సీనియర్ నటి విజయశాంతి ఒకరు.ఇలా హీరోలకు సమానంగా లేడీ ఓరియంటెడ్ సినిమాలలో నటించే సినిమాలను ఎంతో విజయవంతంగా ముందుకు నడిపించిన విజయశాంతి ప్రస్తుతం రాజకీయాలలో ఎంతో బిజీగా మారిపోయారు అలాగే తన సెకండ్ ఇన్నింగ్స్ కూడా ప్రారంభించారని తెలుస్తుంది.ఇప్పటికే మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమా ద్వారా ఈమె ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.

 

ఇకపోతే రాజకీయాలలో ఎంతో బిజీగా ఉన్నటువంటి విజయశాంతికి 25 సంవత్సరాల కొడుకు ఉన్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలపై తాజాగా విజయశాంతి స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు. విజయశాంతి 1988 లో ఎమ్వీ శ్రీనివాస ప్రసాద్ అనే వ్యక్తిని పెండ్లి చేసుకుంది.అయితే మీరు పెళ్లి తర్వాత విజయశాంతి తను పిల్లల్ని కనకూడదనే నిర్ణయాన్ని కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇలా పిల్లలు ఎందుకు వద్దనుకున్నారు అనే విషయాన్ని కూడా ఈమె తెలియజేశారు.

 

ఈ సందర్భంగా విజయశాంతి మాట్లాడుతూ తనకు పాతిక సంవత్సరాల కొడుకు ఉన్నారు అంటూ వస్తున్నటువంటి వార్తలలో ఏ మాత్రం నిజం లేదని విజయశాంతి క్లారిటీ ఇచ్చారు. ఇలా తనకు పాతిక సమస్యలు కొడుకు ఉన్నారు అంటూ చెప్పడం నిజంగా తెలివి లేని వారు చేసే పని అంటూ ఈమె తెలియజేశారు. పెళ్లి తర్వాత ప్రజాసేవ చేయాలని నేను నిర్ణయించుకున్నాను. అయితే ఇలా ప్రజాసేవ చేయడంలో పిల్లలు అడ్డుగా వస్తారేమోనని భావించి పిల్లలని కూడా కనకూడదని నిర్ణయాన్ని తీసుకున్నానని ఈ సందర్భంగా విజయశాంతి తెలిపారు.ఇలా కొడుకు గురించి ఈమె చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక ప్రస్తుతం తాను రాజకీయాలలో ఎంతో బిజీగా ఉన్నానని మంచి సినిమా అవకాశాలు వస్తే తిరిగి తప్పకుండా నటిస్తానని ఈ సందర్భంగా విజయశాంతి తెలియజేశారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: బ్యాండ్ ఎయిడ్ ఎప్పుడు తీస్తారు జగన్.. ఎన్నికలు పూర్తయ్యే వరకు ఇంతేనా?

CM Jagan: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు వస్తున్నాయి అంటే సింపతి కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున డ్రామాలు చేస్తున్న సంగతి తెలుసు గత ఎన్నికలలో భాగంగా కోడి కత్తి కేసు అంటు...
- Advertisement -
- Advertisement -