Samantha: తెలుగు సినిమా ఇండస్ట్రీలోని మోస్ట్ ట్యాలెంటెడ్ హీరోయిన్ల జాబితాలో హీరోయిన్ సమంత పేరు తప్పక ఉంటుంది. ‘ఏమాయ చేసేవే’ సినిమా నుండి తెలుగు ప్రేక్షకులను మాయ చేస్తున్న సమంత.. గత కొద్ది దశాబ్దాలుగా తన సినీ ప్రస్థానాన్ని కొనసాగిస్తూనే ఉంది. నటనలో తనను తాను మెరుగుపరుచుకుంటూ సమంత తనకు తానే పోటీ అని నిరూపించుకుంటోంది.
తాను మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్నట్లు హీరోయిన్ సమంత స్వయంగా వెల్లడించగా.. ప్రస్తుతం ఆమె కొద్దికొద్దిగా కోలుకుంటోంది. అయితే తన ఆరోగ్యానికి సంబంధించిన ప్రతి విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా పంచుకుంటోంది. కాగా తాజాగా ఆమె తాను షూటింగ్ లో ఇబ్బంది పడిన ఘటనను సోషల్ మీడియాలో షేర్ చేసుకోగా.. నెటిజన్లు సమంతకు అండగా నిలుస్తూ పోస్టులు పెడుతున్నారు.
హీరోయిన్ సమంత ప్రస్తుతం గుణశేఖర్ డైరెక్షన్ లో ‘శాకుంతలం’ సినిమాలో నటిస్తుండగా.. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం నడుస్తోంది. అయితే ఈ సినిమా షూటింగ్ లో ఒకే భంగిమలో ఉండటం, ముఖంలో హావభావాలు ఒకేలా పెట్టడం చాలా ఇబ్బందిగా అనిపించిందని హీరోయిన్ సమంత తన అనుభవాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది.
సోషల్ మీడియాలో సమంత పోస్ట్ పెడుతూ.. ‘శాకుంతలంలో నటించేటప్పుడు నా పాత్ర స్వభావానికి తగ్గట్టు ముఖంలో హావభావాలు ఒకేలా పెట్టడం, ఒకే భంగిమలో ఉండటం కష్టంగా అనిపించింది. నడుస్తున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు, పరిగెత్తేటప్పుడు ఆఖరికి ఏడుస్తున్నప్పుడు కూడా ముఖంలో ఎక్స్ ప్రెషన్ ఒకేలా పెట్టాల్సి వచ్చింది. అలాగే ఈ భంగిమనే కొనసాగించాల్సి వచ్చింది. అలా ఒకే స్టైల్ ను కొనసాగించడం నా వల్ల కాలేదు. దాని కోసం ప్రత్యేక శిక్షణ తీసుకున్నాను. అలా కాకుండా ఈ సాషా (పెంపుడు కుక్క)ను తీసుకెళ్లాల్సి వచ్చింది’ అని పేర్కొంది. కాగా సమంత ప్రస్తుతం శాకుంతలం చేస్తుండగా.. విజయ్ దేవరకొండతో కలిసి ‘ఖుషి’ సినిమా కూడా చేస్తోంది.