Health Tips: మనలో చాలా మందికి కాఫీ,టీ లు తాగే అలవాటు ఉంటుంది. అయితే చాలామంది ఉదయం లేదా సాయంత్రం సమయంలో టీ తాగే సమయంలో వాటితో పాటు బ్రెడ్, బిస్కెట్, టోస్ట్, రస్క్ వంటివి తింటూ ఉంటారు. ఉదయం సమయంలో కొందరు బ్రేక్ ఫాస్ట్ గా ఇలా తింటూ ఉంటారు. సాయంత్రం సమయంలో స్నాక్స్ గా కూడా తీసుకుంటూ ఉంటారు. కానీ టీతో పాటు రస్క్ తినే వారికి ప్రమాదం పొంచి ఉంది అంటున్నారు నిపుణులు. మరి టీ,రస్క్ తినడం వల్ల ఇటువంటి అనారోగ్య సమస్యలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
టీతో పాటుగా రస్క్ తినడం వల్ల హృదయ సంబందిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. అలాగే అధిక బీపీ, అధిక బరువు, మధుమేహం, కొలెస్ట్రాల్ వంటి సమస్యలు వంటి సమస్యలు కూడా తలెత్తుతాయి. రస్క్ బిస్కెట్లు తయారు చేయడానికి మైదా పిండిని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. మైదాపిండి ఎక్కువగా తినడం ఆరోగ్యానికి హానికరం. మైదాపిండి బరువు పెరిగేందుకు కారణం అవుతుంది. అంతేకాకుండా జీర్ణ వ్యవస్థను కూడా దెబ్బతీస్తుంది. మైదా పిండి కారణంగా మలబద్ధకం, గ్యాస్, అల్సర్, ఇంకా ఇతర సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉందీ.
టీతో పాటు రస్క్ కలిపి తింటే ఊబకాయం, క్యాన్సర్, చర్మ సంబంధిత వ్యాధులు, థైరాయిడ్ వంటివి కూడా వస్తాయి. టోస్ట్ వాడకాన్ని తగ్గిస్తేనే అన్ని వ్యాధుల నుండి బయట పడవచ్చు అని వైద్యులు అంటున్నారు. ఉదయం సమయంలోనే కాకుండా సాయంత్రం సమయంలో కూడా ఈ రస్క్ టోస్ట్ వంటివి తీసుకోకపోవడం మంచిది. వీటిని తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాల విషయం పక్కన పెడితే అనేక రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.