Taraka Ratna: తారకరత్న ఆత్మ పూజారికి కలలో కనిపించి ఏం చెప్పిందో తెలుసా?

Taraka Ratna: చనిపోయిన వారు ఆత్మలుగా మారుతారనే ప్రచారం ఇప్పటికీ ఉంది. దీనిని అనేక మంది విశ్వసిస్తారు కూడా. అంటే దీనికి ఒక ప్రామాణికం అంటూ ఏమీ లేకపోయినా, పల్లెల్లో, పట్టణాల్లోని కొందరు నమ్ముతారు. అయితే కొన్ని రోజుల క్రితం చనిపోయిన నందమూరి తారకరత్న ఆత్మగా సంచరిస్తున్నారని, ఓ వ్యక్తికి కలలో కనిపించినట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై చర్చ కూడా ప్రారంభమైంది.

మనిషి మరణం తర్వాత ఏమి జరుగుతుందన్న దానిపై ఇప్పటికే క్లారిటీ లేదు. దీనిపై విదేశీ శాస్త్రవేత్తలు ఇప్పటికీ పెద్ద ఎత్తున పరిశోధనలు చేస్తున్నారు. కానీ ఏమీ కనుగొనలేదు. ఏళ్ల తరబడి పరిశోధనలు చేస్తున్న ఫలితం మాత్రం రాలేదు. సైన్సు ప్రకారం చనిపోయిన తర్వాత మానవుడి శరీరంలో ఎటువంటి ప్రక్రియలు జరగవని అంటుంటారు. ఏ జీవిలోనైనా ప్రాణం ఉన్నంత వరకేనని, అనంతరం ఎటువంటి చర్యలు ఉండంటుంది సైన్సు. కానీ శాస్త్రాల ప్రకారం చనిపోయిన మనిషి ఆత్మగా మారుతారనే ప్రచారం ఉంది.

 

మనిషి ఆత్మగా మారే దానిపై ఇప్పటికే అనేక మందిలో విశ్వాసం ఉంది. అప్పుడప్పుడు చనిపోయిన వ్యక్తులు కలలోకి వస్తుంటారని చెబుతుంటారు. దీన్ని మనం కొట్టిపారేయలేం. ఎందుకంటే మన జీవితంలోనూ అలాంటి ఘటనలు జరిగి ఉండవచ్చు. అత్యంత సన్నిహితులకే చనిపోయిన వ్యక్తులు కనిపిస్తారనే ప్రచారం సైతం ఉంది. అయితే తారకరత్న కూడా అలా ఓ వ్యక్తికి, కాదు కాదు ప్రముఖ పూజారికి కనిపించాడట.

 

హైదరాబాద్ లోని ప్రముఖ పూజారికి తారకరత్న ఆత్మ కలలో కనిపించిందని చెబుతున్నారు. ఆయన అంతా బాగున్నట్లు ఆ పూజారికి తెలియజేశాడట. అంతేకాదు భార్య అలేఖ్య, తన పిల్లలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని ఆత్మ చెప్పిందని సమాచారం. నిజంగా తారకరత్న వచ్చాడా అని కొందరు ఆ పూజారిని అడుగుతుంటే, వారిపై ప్రేమ ఉంది కాబట్టే, చనిపోయిన తర్వాత కూడా బాధ్యతగా ఉంటున్నాడని అంటున్నారు మరి కొందరు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -