Jagan: వైయస్ జగన్ ప్రవర్తన ఎంతో ఆశ్చర్యకరంగా ఉంది తనని నమ్ముకుని ఓటేసిన ప్రజలకి ఎవరైనా మంచి చేయాలని చూస్తారు. కానీ కొంతమంది మాత్రం మనల్ని నమ్ముకుని మన వెంట వచ్చిన వారిని పాములుగా వాడుకొని వారి సమాధుల మీద మెడలు కట్టుకునే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు ఇప్పుడు వైయస్ జగన్ ప్రవర్తన అలాగే ఉంది కేవలం దళిత ఎమ్మెల్యేల వల్లే ఆయన అసంతృప్తి అన్నట్లు ఉంది అయినా వ్యవహారం నమ్మిన దళితుల్ని ఇంత ఘోరంగా రాజకీయ ప్రయోజనాలకు వేదిక చేసి వారిలో ఎలాంటి నాయకత్వం బలపడకూడదు అన్నట్లుగా జగన్ రెడ్డి చేసిన రాజకీయం అందర్నీ విస్మయ పరుస్తోంది.
పెద్దిరెడ్డి చెప్పిందే నియోజకవర్గంలో చేశాను పెద్దిరెడ్డిని కాదని చిన్న పని కూడా చేయలేదు అని సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం ఆవేదన వ్యక్తం చేశారు నిజానికి ఆయనకు ఎంపీ టికెట్ ఇచ్చారు కానీ తనను అవమానకరంగా తొలగించిన వైనం చూసి ఆయన రగిలిపోయారు దళిత నేతననే ఇంత అవమానించారు అంటూ రగిలిపోయారు.చిత్తూరుకు చెందిన దళిత ఎమ్మెల్యే ఎంఎస్ బాబు కూడా అదే మాట చెప్పారు.
అనంతపురం జిల్లాకు చెందిన జొన్నలగడ్డ పద్మావతి కూడా అదే చెప్పారు వీరంతా బయటపడ్డారు కానీ బయటపడవలసిన వారు ఇంకా చాలామంది ఉన్నారు. అయితే ఈ ప్రశ్నలకు జగన్ దగ్గర నుంచి సమాధానం రావడం లేదు. పేరుకు మాత్రం దళిత ఎమ్మెల్యే అని హోంమంత్రిని చేశారు కానీ ఆమె అధికారిక ఆఫీసులో ఎప్పుడో కూర్చోలేదు. ఇలా అధికారం దళితులకు ఇచ్చి పెత్తందారులైన రెడ్డి సామాజిక వర్గ నేతలే మొత్తం వ్యవహారం జగ్గబెడుతూ వచ్చారు.
ఐదు రోజులపాటు కాసులతో జరిపి చివరికి ఐదో జాబితా రిలీజ్ చేస్తే అందులో సిట్టింగ్ ఎస్టి గొడ్డేటి మాధవికి సీటు లేకుండా పోయింది. ఇక ఆదిమూలం ది కూడా అదే ఆరోపణ. ఈసారి సీఎం జగన్ బీసీ అభ్యర్థులకు ఎక్కువ సీట్లు ఇస్తారని రెడ్డి సామాజిక వర్గానికి సీట్లు తగ్గించేస్తారని వైసీపీ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి కానీ ఐదు జాబితాలు విడుదల తర్వాత దళిత నేతలని టార్గెట్ చేసినట్లుగా కనిపిస్తుంది.