Water: గతంలో బావులు, చెరువులు, చెలిమాల్లోని నీరు నిటిని వంటలకు, తాగేందుకు వాడేవారు. అయినా ఆ నీటితో ఎలాంటి హానీకరం అయ్యేంది కాదు. దీంతో పాటు ఆ నీరు స్వేచ్ఛగా ఓ రుచితో కూడుకునేది. ఎలాంటి ఫిల్టర్ లేకుండా వచ్చేనీటిని తాగిన నాటి వాళ్లు ఇప్పటికి ఆరోగ్యంగా బలంగా ఉన్నారు. ప్రస్తుతం వివిధ యంత్రాల ద్వారా నీటిని శుద్ధి(ఫిల్టర్) చేసి తాగినా వివిధ రోగాల దరిచేరుతున్నాయి. ప్రస్తుతం అందరు ఫిల్టర్ నీటినే తాగుతున్నారు. మరికొందరైతే తమ ఇళ్లలోనే చిన్న చిన్న ఫిల్టర్ మెషిన్లు బిగించుకుంటున్నారు.
అయిన మనం రోజు తాగే నీరు పరిశుభ్రంగా ఉందా.. లేదా అనేది నిత్యం గమనించాల్సిందే. లేదంటే అది మన ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపి అనారోగ్యానికి గురి చేస్తోంది. మనవశరీరంలో డైడ్రేటెట్ ఉండాలంటే మనం కచ్చితంగా తగినంతా నీరు తాగాల్సిందే అంటున్నారు వైద్య నిపుణులు. అందుకోసం ప్రతి రోజూ దాదాపుగా 10 లేదా 12 గ్లాసుల పరిశుభ్రమైన నీరు తాగాలి.
మురికి నీరు తాగితే తలెత్తే సమస్యలివే..
- కలుషితం, మురికి నీరు పొరపాటున తాగితే ఆనీరు జీర్ణక్రియ ప్రక్రియను ప్రభావితం చేస్తోంది. దాంతో కడుపు సంబం«ధిత వ్యాధులు తలెత్తుతాయి.
2. మురికి నీరు తీసుకోవడంతో మానసిక సమస్యలతో పాటు మెదడుపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతోంది.
3. స్వచ్ఛమైన నీటిని తాగడం ద్వారా మనుషులకు డిహైడ్రేషన్ సమస్య రాదు.
4. మురికి నీరు సేవించడం ద్వారా డిహైడ్రేషన్ సమస్య తలెత్తి మూర్చవా«ధి, తల తిరగడం, ఉన్నట్టుండి స్పృహకోల్పోవడం వంటి సమస్యలు వెంటాడుతాయి.
5. మురికి నీరు తాగడం ద్వారా కిడ్నీ సంబంధిత వ్యాధులు సోకుతాయి.
6. మూత్రపిండాల భాగం మొత్తం నీటిలో ఉంటుంది కాబట్టి మురికి నీరు తాగడంతో మూత్రపిండాల్లో రాళ్లు వచ్చే ప్రమాదం ఉంటుంది.
7. మనం నిత్యం తాగే నీరు స్వేచ్ఛమైంది ఉండాలని శరీరానికి కావాల్సినంతా నీరు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.