Amit Shah: ఇంట గెలిచినా రచ్చ గెలవలేరా.. అమిత్ షా పరువు పోతోందిగా!

Amit Shah: వచ్చే ఎన్నికలలో ఈసారి ఎలా అయినా గెలిచి తీరాలి అని బీజేపీ పార్టీ తపన పడుతోంది. అందుకు తగ్గట్టుగా వ్యూహ రచనలు కూడా సిద్ధం చేసుకుంటోంది. మోడీ తొమ్మిదేళ్ల పాలన విజయాల గురించి ప్రచార సభలు దేశవ్యాప్తంగా నిర్వహించాలని పార్టీ పిలుపు ఇస్తే తెలంగాణలో ఏకంగా అమిత్ షా, జెపి నడ్డా, నరేంద్రమోడీలతో సభలు ప్లాన్ చేశారు. కాగా పార్టీ కాస్త బలహీనంగా ఉన్నదని భావిస్తున్న ఖమ్మం జిల్లాలోనే తమ సత్తా చాటే ఉద్దేశంతో అమిత్ షా సభను అక్కడ ఏర్పాటుచేశారు.

 

కానీ ఏర్పాట్లన్నీ పూర్తి అయ్యాక గుజరాత్ వరదల వల్ల అది కాస్త వాయిదా పడింది. అయితే ఇప్పుడు తాజాగా పార్టీ వర్గాల నుంచి తెలుస్తున్న‌ సమాచారాన్ని బట్టి అమిత్ షా సభ నిర్వహించడానికి కొత్త వేదికను అన్వేషించాలని పార్టీ అనుకుంటోంది. ఖమ్మంలో కాకుండా మరెక్కడైనా నిర్వహించాలని అనుకుంటున్నారట. అందుకు గల కారణాలు కూడా లేకపోలేదు. ఖమ్మం జిల్లాకు చెందిన భారాస నాయకుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఇద్దరూ కాంగ్రెసు పార్టీలో చేరడం ఖరారు అయ్యింది. చివరగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బుధవారం వీరిని కలిసి లాంఛనంగా తమ పార్టీలోకి ఆహ్వానించనున్నారు.

కాగా ఈ నెల 25న వీరిద్దరూ ఢిల్లీలో రాహుల్ గాంధీని కలిసి పార్టీలో తాము ఆశిస్తున్న ప్రాధాన్యం గురించి చర్చిస్తారు. 26న ఢిల్లీలోనే ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెసులో చేరుతున్న సంగతిని కూడా ప్రకటిస్తారు. అయితే ఆ తర్వాత జులై 2 వ తేదీన ఖమ్మంలో జరిగే భారీ బహిరంగ సభలో రాహుల్ సమక్షంలో వీరు, అనుచరులు, ఇతర నాయకులు అనేకమందితో కలిసి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోనున్నారు. ఆ విధంగా ఇలా షెడ్యూలు ఖరారైంది. ఇక బీజేపీ పరిస్థితి చూస్తే అమిత్ షా సభను మళ్లీ ఎప్పుడు నిర్వహించేది ఇప్పటిదాకా షెడ్యూలు రాలేదు. జులై 2 లోగా అదే ఖమ్మంలో నిర్వహించగలిగితే పరిస్థితి ఒక తీరుగా ఉంటుంది. లేదంటే సభా నిర్వహణకు వేదికను మార్చుకోవాల్సి వస్తుంది.

 

ఎందుకంటే రాహుల్ గాంధీ వచ్చే సభను జులై 2న పొంగులేటి ఆధ్వర్యంలో నిర్వహించినప్పుడు దానిని అత్యంత భారీగా, భారీ జనసమీకరణతో నిర్వహిస్తారని అంచనా వేయవచ్చు. దాని తర్వాత బీజేపీ అమిత్ షా సభ నిర్వహిస్తే ఆ సభకు పోటీగా జనసమీకరణ చేయాల్సి ఉంటుంది. దానికి తోడు ఖమ్మం జిల్లాలో పార్టీ వీక్ అనుకుంటుండగా పొరుగు జిల్లాలనుంచి తరలించినా కాంగ్రెస్ సభను తలదన్నేలా నిర్వహించడం సాధ్యం కాదని పార్టీ నాయకుల అంచనా. ఒకవేళ అదే కనుక జరిగితే అమిత్ షా సభ వలన అదనపు మైలేజీ రావడానికి బదులుగా, తమ వీక్ నెస్ బయటపడి పరువుపోతుందని వారు ఆలోచిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -