Golden Leg: సినిమా ఫంక్షన్లకు గెస్ట్ గా ఎవరిని పిలవాలనే టెన్షన్లో నిర్మాతలు, హీరోలు ఉండేవారు. ఎక్కువశాతం మంది మెగా, అల్లు ఫ్యామిలీ వైపే చూసేవారు. చాలా వరకు సినిమాల్లో గెస్ట్ లుగా మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ వచ్చి.. సినిమా గురించి, సినిమాపై రెండు మాటలు మాట్లాడి వెళ్లిపోయారు. అయితే వీరికి గెస్ట్ గా బాలయ్య బాబు రావడం ఏమో కానీ.. సినిమా ఫ్లాప్ అయితే మాత్రం వీరిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఓ రేంజ్లో ఉండేది. మొత్తం ఫెయిల్యూర్ టాక్ను మెగా ఫ్యామిలీపై తోసి పడేసేవారు.
ప్రస్తుతం బాలయ్య ట్రెండ్ నడుస్తోంది. నందమూరి బాలకృష్ణ మొదటి సారిగా ఓ చిన్న సినిమా ప్రీ ఈవెంట్లో హాజరయ్యడు. బాలయ్య గెస్టుగా వెళ్లిన ప్రతి సినిమా హిట్ కొట్టాయి. దాంతో నిర్మాత బాలయ్య బాబును గెస్టుగా పిలిచేందుకు ఇష్టపడుతున్నారు. ఇటీవల ‘ఊర్వశివో.. రాక్షసివో..’ సినిమాకు గెస్టుగా వెళ్లారు. ఈ సినిమా మంచి టాక్తో దూసుకెళ్లింది. తాజా హీరో విశ్వక్సేన్ నటించిన సినిమా ‘ధమ్కీ’ ఈ సినిమాకు గెస్ట్ గా బాలయ్య వచ్చారు. బాలయ్య వస్తున్నాడని తెలిసినప్పటి నుంచే ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు. బాలయ్యది గోల్డెన్ లెగ్ అని, ధమ్కీ సినిమా కూడా హిట్ అవుతుందన్నారు.
ధమ్కీ సినిమా ట్రైలర్ లాంఛ్లో బాలయ్య ఓ డౌలాగ్ కొట్టాడు. ‘నా ఇం నా ఇంటజ్’. అనే డైలాగ్ చెబుతూ ప్రేక్షకుల్లో జోష్ నింపాయి అలాగే ట్రైలర్లో కూడా విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. గెట్ ఆఫ్ మై కార్, మెడికల్ షాపు దగ్గర కారును ఆపనా వంటి డబుల్ మీనింగ్ డైలాగులు ప్రత్యేక ఆకర్షణగా మిగిలాయి. అయితే ఈ ట్రైలర్లోనే మొత్తం స్టోరీ చెప్పిన్నట తెలుస్తోంది. అలాగే విశ్వక్ సేన్ కూడా డ్యుయల్ రోల్లో యాక్టింగ్ చేస్తున్నాడు. అయితే కోటీశ్వరుడైన విశ్వక్సేన్ను ఎందుకు చంపాలని అనుకున్నారనే ప్రశ్నార్థకంగా మారింది. దీనికి ఆన్సర్ తెలియాలంటే మరొకొద్ది రోజు వేచి చూడాల్సిందే..