Ambati Rayudu: ప్రముఖ తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు కొద్ది రోజుల క్రితం వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. వైసీపీలో చేరే ఉద్దేశంతోటే గత కొద్దిరోజులుగా జగన్మోహన్ రెడ్డిని పొగుడుతూ పోస్టులు పెట్టేవాడు. తాజాగా జగన్ సమక్షంలో వైసిపి కండువా కప్పుకున్నాడు. గుంటూరు నుంచి ఎంపీగా పోటీ చేస్తాడని ఊహాగానాలు కూడా వచ్చాయి. ఎంపీ సీటు కోసమే వైసీపీలో చేరినట్లు కూడా రాజకీయ ప్రముఖులు అంటున్నారు. అయితే ఏమైందో తెలియదు గానీ ఈరోజు ఉదయం వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు అంబటి రాయుడు ప్రకటించాడు. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉండాలనుకున్నట్లు చెప్పుకొచ్చాడు.
అయితే అంబటి రాయుడు వైసిపిని వదిలేయడానికి జగన్మోహన్ రెడ్డి సీటు ఇస్తానని చెప్పి నమ్మించి మోసం చేయడమే అని అంటున్నారు. గుంటూరు ఎంపీ సీటు లావు శ్రీకృష్ణదేవరాయలకు ఇస్తున్నట్లు తెలిసి అంబటి రాయుడు మనస్తాపం చెంది పార్టీకి రాజీనామా చేశాడట. ఇదే కాకుండా ఎంపీ సీటు కావాలంటే 60 కోట్లు డిపాజిట్ చేయాల్సిందని వైసిపి వర్గాలు చెప్పడంతో దీనికి కూడా హర్ట్ అయ్యి పార్టీని వదిలేసినట్లుగా చెబుతున్నారు. మునిగిపోయే ఓడ ఎక్కావ్ వెంటనే దిగిపోయి మంచి పని చేసావ్ అంటూ అంబటి రాయుడు అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.