Tirumala: తిరుమలకు దర్శనానికి వెళ్లేవాళ్లకు శుభవార్త.. ఏం జరిగిందంటే?

Tirumala: మన భారత దేశంలో ఎన్నో ప్రసిద్ధి చెందిన ఆలయాలు ఉన్నాయి. ఇలా ప్రసిద్ధి చెందిన దేవాలయాలలో తిరుమల తిరుపతి దేవస్థానం ఒకటి. కలియుగ దైవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఏడుకొండల పై కొలువై ఉన్నారు.ఇలా స్వామివారిని దర్శించి మనస్ఫూర్తిగా నమస్కరించిన యెడల కోరిన కోరికలు నెరవేర్చునని భక్తులు భావిస్తారు ఈ క్రమంలోనే దేశం నలుమూలనుంచి కాకుండా విదేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తిరుమల చేరుకొని శ్రీవారిని దర్శించుకుంటారు.

ఇలా ప్రతిరోజు కొన్ని లక్షల సంఖ్యలో భక్తుల స్వామి వారిని దర్శనం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే స్వామివారి దర్శనం కోసం వచ్చే వృద్ధులకు చిన్న పిల్లల తల్లులకు ఎంతో ఇబ్బందికరంగా మారింది అయితే ఈ విషయాలను దృష్టిలో ఉంచుకున్నటువంటి టీటీడీ వృద్ధుల ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తోంది.మనం స్వామివారి దర్శనం కోసం టికెట్ బుక్ చేసుకునే సమయంలో 60 సంవత్సరాలు వయసు పైబడిన వారికి ప్రత్యేకంగా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.

 

ఇలా 60 సంవత్సరాలు పైబడిన వృద్ధుల కోసం ప్రత్యేకంగా క్యూ ఏర్పాటు చేసి స్వామివారి దర్శనం కల్పిస్తారు. కేవలం అరగంట, గంటలోపే వృద్ధులకు స్వామివారి దర్శనం కల్పించే దిశగా టీటీడీ చర్యలు చేపడుతుంది. ఈ సమయంలో ఇతర క్యూ లైన్ లను దర్శనం నిలిపివేసి వృద్ధులకు దర్శనం కల్పించేలా ఏర్పాట్లు చేయనున్నారు. అలాగే ప్రసాదాలను తీసుకోవడం కోసం వృద్ధులకు ప్రత్యేకమైన ఎలక్ట్రిక్ వాహనాలను కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు.

 

ఇలా టీటీడీ చేపడుతున్న ఈ చర్యల వల్ల ఇకపై వృద్ధుల స్వామివారిని దర్శించుకోవడం మరింత సులభతరం అవుతుంది.ఇక ఈ విషయం గురించి ఏ విధమైనటువంటి సందేహాలు కనుక ఉంటే ఈ సందేహాలను నివృత్తి చేయడం కోసం టిటిడి సలహా నెంబర్08772277777 హెల్ప్ లైన్ నెంబర్ కు ఫోన్ చేసి మీకున్నటువంటి సందేహాలను తీర్చుకోవచ్చు.

 

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -