Gorantla Madhav: 2024 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు చస్తాడు.. వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు వైరల్!

Gorantla Madhav: ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జైలులో ఉన్న విషయం మనకు తెలిసిందే. ఈ విధంగా చంద్రబాబు నాయుడు జైలులో ఉన్నప్పటికీ ఈయనని ఉద్దేశపూర్వకంగానే అరెస్టు చేశారని ఎన్నికల సమయంలో ఇలా అరెస్టు చేసే పార్టీకి తీరని దెబ్బ కొట్టారు అంటూ టిడిపి నాయకులు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా వైఎస్ఆర్సిపికి సామాజిక బస్సు యాత్ర ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే హిందూపురం నియోజకవర్గంలో పర్యటించినటువంటి ఎంపీ గోరంట్ల మాధవ్ చేసినటువంటి కామెంట్స్ సంచలనగా మారాయి. ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ 2024వ సంవత్సరంలో కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తారని తెలిపారు. ఆయనే అధికారంలో ఉంటారని ఇక 2024వ సంవత్సరంలోని ఎన్నికలకు ముందే చంద్రబాబు నాయుడు చస్తాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

2024లో చంద్రబాబు నాయుడు చనిపోతారని పవన్ సినిమాలు చూసుకుంటారంటూ ఈయన ఆరోపణలు చేశారు. ఇక ఇన్ని రోజులు పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర చేసి ఇప్పుడు ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారని ఈయన విమర్శించారు. అలాగే లోకేష్ పాదయాత్ర పై కూడా మాధవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈయన చేసిన వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డిని ఇబ్బందులలో పడేసాయనే చెప్పాలి.

జైలలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు పై హత్య ప్రయత్నాలు జరిగే అవకాశాలు ఉన్నాయని ఆయనకు ఏదైనా జరిగితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బాధ్యత వహించాలి అంటూ ఇదివరకు లోకేష్ చంద్రబాబు పట్ల జరుగుతున్నటువంటి కుట్రలపై సందేహాలు వ్యక్తం చేశారు ఇలాంటి తరుణంలోనే గోరంట్ల మాధవ్ ఏకంగా చంద్రబాబు నాయుడు చస్తాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేయడంతో ఈ విషయం కాస్త చర్చలకు కారణమైంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -