Chittoor: ప్రేమించమంటూ వేదింపులు.. కాదనేసరికి?

Chittoor: రోజు రోజుకి సమాజంలో ఆడవారికి రక్షణ కరువవుతోంది. ఉద్యమం దేశవ్యాప్తంగా ఏదో ఒక ప్రదేశంలో ఆడవారిపై అత్యాచారాలు మానసిక వేధింపులు,లైంగిక వేధింపులు జరుగుతూనే ఉన్నాయి. చిన్నపిల్లల నుంచి ముసలి వారి వరకు ఏ ఒక్కరిని విడిచిపెట్టడం లేదు. ప్రేమించమని వెంట పడటం నో అనేసరికి చంపడం లేదంటే అత్యాచారం చేయడం లాంటివి చేస్తున్నారు. దేశవ్యాప్తంగా నిత్యం పదుల సంఖ్యలో ఆడవారిపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే అత్యాచారం చేసిన తర్వాత ఆ నరరూప రాక్షసులు అంతటితో ఆగకుండా వారిని చంపి ఆత్మహత్యలుగా చిత్రీకరిస్తున్నారు.

తాజాగా అలాంటి దారుణమైన ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆ దారుణ ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. చిత్తూరు జిల్లా కొండమిట్ట ప్రాంతంలో ప్రశాంతి అనే ఒక యువతి బ్యూటీపార్లర్ లో పనిచేస్తోంది. అయితే గత కొంత కాలంగా ఆమెను చక్రవర్తి అనే యువకుడు ఆమె వెంటపడి వేధిస్తున్నాడు. కానీ ప్రశాంతి చక్రవర్తి ప్రేమను తిరస్కరిస్తూ వచ్చింది. దాంతో కోపంతో ఊగిపోయిన చక్రవర్తి, ప్రశాంతి పని చేస్తున్న బ్యూటీ పార్లర్ కి వెళ్లి ఆమెపై దాడి చేసి తనతో తెచ్చుకున్న కత్తితో గొంతు కోశాడు. తీవ్ర గాయంతో ప్రశాంతి పడిన ప్రశాంతి అక్కడిక్కడే మృతి చెందింది.

 

అయితే రక్తపు మడుగులో పడి ఉన్న ప్రశాంతిని చూసి భయంతో చక్రవర్తి తాను కూడా గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. అది గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని ప్రశాంతి మృతదేమాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. కొనఊపరితో ఉన్న చక్రవర్తిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం నింధితుడు చక్రవర్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

Union Minister Piyush Goyal: వైఎస్సార్ ను సైతం ముంచేసిన సీఎం జగన్.. ఆ కేసులో కావాలనే ఇరికించారా?

Union Minister Piyush Goyal: వైయస్సార్ కాలనీ పట్ల కేంద్రమంత్రి పియూష్ గోయెల్ తన ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో పీయూష్ గోయల్ విలేకరులతో మాట్లాడుతూ జగన్ పాలనపట్ల విరుచుకుపడ్డారు. వైయస్సార్ కాంగ్రెస్...
- Advertisement -
- Advertisement -