Rashmika: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అల్లు అర్జున్ హీరో గా నటించిన పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ గా మారిన విషయం తెలిసిందే. అంతేకాకుండా భాషతో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది. పుష్ప సినిమాతో ఈ ముద్దుగుమ్మకు పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ దక్కడంతో అవకాశాలు క్యూ కడుతున్నాయి. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం రష్మిక అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప 2 సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.
అలాగే మరికొన్ని ప్రాజెక్టులలో కూడా నటిస్తోంది. బాలీవుడ్, కోలీవుడ్ సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతోంది రష్మిక. కాగా రష్మిక మందన ఇప్పటికే పుష్ప2 షెడ్యూల్ ని కూడా పూర్తి చేసుకుంది. ఇకపోతే ప్రస్తుతం సోషల్ మీడియాలో రష్మికకు సంబంధించి ఒక ఆసక్తికర వార్త చెక్కులు కొడుతోంది. అదేమిటంటే తన మేనేజర్ చేతిలో రష్మిక మోసపోయిందన్న వార్త ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. రష్మిక దగ్గర చాలా కాలంగా పని చేస్తున్న మేనేజర్ ఆమెను దారుణంగా మోసం చేసినట్లు తెలుస్తోంది. దాదాపు రూ.80 లక్షల మేర అతను ఫ్రాడ్ చేశాడట.
అతను తనను మోసం చేసి, భారీగా డబ్బులు తిన్న విషయం ఆలస్యంగా తెలుసుకున్న రష్మిక వెంటనే అతణ్ని తొలగించినట్లు సమాచారం. తెలుగులో ఒక మంచి పేరున్న మేనేజర్ ను తన డేట్లు, ఇతర వ్యవహారాలు చూసేందుకు నియమించుకుంది. అతను మాత్రం రష్మికను దారుణంగా మోసం చేసినట్టు తెలుస్తోంది. అయితే ఆమెను ఎలా మోసం చేశాడు అన్న వివరాలు మాత్రం తెలియాల్సి ఉంది.