Venu Swamy: 2024లో ఏపీ సీఎం అతనే.. వేణుస్వామి సంచలన వ్యాఖ్యలు!

Venu Swamy: ప్రముఖ జ్యోతిష్య శాస్త్రుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వేణు స్వామి తరచూ సినిమా సెలబ్రిటీలు రాజకీయ నాయకుల జాతకాలు చెబుతూ వార్తల్లో నిలుస్తున్నారు. ఈయన సమంత నాగచైతన్య పెళ్లి గురించి వార్తలు రావడంతో ఈ పెళ్లి జరిగిన వారు విడిపోతారంటూ వారి జాతకం చెప్పారు. అయితే ఆ సమయంలో ఈయనపై చాలా మంది విమర్శలు చేశారు. కానీ వేణు స్వామి చెప్పిన విధంగానే సమంత నాగచైతన్య విడాకులు తీసుకుని విడిపోవడంతో అందరూ ఈయన మాటలు నిజమయ్యాయని భావించారు.

ఇకపోతే తాజాగా వేణు స్వామి ఏపీ ముఖ్యమంత్రి గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.2024వ సంవత్సరంలో జరగబోయే ఎన్నికల దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కు కాబోయే ముఖ్యమంత్రి ఎవరు అనే విషయం గురించి ఈయన తెలియజేశారు.2024 లో కూడా ఏపీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గెలుస్తారని వేణు స్వామి తెలిపారు.

 

జగన్ గారి జాతకం ప్రకారం ఆయన్ని టార్గెట్ చేయాలి అనుకుంటే 2022 ఏప్రిల్ 25లోపు టార్గెట్ చేయాలి.. ఆ స‌మ‌యంలో ఆయనకు అష్టమశని నడుస్తోంది. ఇది దాటిపోయింది కనుక జగన్మోహన్ రెడ్డిని ఎవరు ఏమి చేయలేరని చెప్పారు. 2019లో జగన్ కి జాతకపరంగా స్టార్ట్ అయిన ఫేజ్.. 2022 ఏప్రిల్ 1వ తేదీకి క్లోజ్ అవుతుంది. అంటే.. 2022 ఏప్రిల్ 2 నుంచి రాజకీయంగా చాలా రాష్ట్రాలలో రాజకీయపరమైన మార్పులుజరుగుతాయని ఈ మార్పులు ఆంధ్రప్రదేశ్లో కూడా జరుగుతాయని వేణు స్వామి తెలిపారు.

 

ఇక 2019వ సంవత్సరం నుంచి జగన్ 17 సంవత్సరాల పాటు సీఎం గా ఉంటారని అంటే మూడుసార్లు ఈయన సీఎంగా గెలుస్తారని వేణు స్వామి తెలిపారు. జగన్మోహన్ రెడ్డికి బుధమహర్ధశ స్టార్ట్ అయ్యింది. 2019లో స్టార్ట్ అయిన ఈ బుధమహర్దశ 17 ఏళ్లు పాటు ఉంటుందనీ తెలిపారు. ఇక మిగిలిన రెండేళ్లలో ఆయనకు గండాలు ఉన్నాయి. వాటి గురించి తరువాత చెప్తా కానీ.. వచ్చే ఎన్నికల్లో మాత్రం జగన్ సీఎం అని వేణు స్వామి చెప్పుకొచ్చారు.

 

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కు పోటీ అదే పేర్లతో ఉన్న ఇద్దరు పోటీ.. వైసీపీ కుట్ర చేస్తోందా?

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల త్వరలోనే జరగబోతున్నటువంటి నేపథ్యంలో ఎన్నికల హడావిడి నెలకొంది. ఈ క్రమంలోనే ఎన్నికలకు నామినేషన్ ప్రక్రియ కూడా పూర్తి అయింది. అయితే ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో ఒక్కో...
- Advertisement -
- Advertisement -