Hero Aadi: హిట్ రాకున్న హీరో ఆది కోసం క్యూ కడుతున్న నిర్మాతలు.. ఎందుకంటే?

Hero Aadi: తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రముఖ హీరో, డబ్బింగ్ ఆర్టిస్ట్, బహుముఖ ప్రజ్ఞశాలి సాయి కుమార్ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన ప్రస్తుతం ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తూనే.. మరోవైపు ఈటీవీలో ఓ షోకి హోస్టుగా కొనసాగుతున్నారు. తనదైన శైలిలో అభిమానుల ఆదరణ పొందుతున్నాడు. సాయి కుమార్ సినీ వారసుడిగా ఆది సాయి కుమార్ ఇండస్ట్రీకి అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. ‘ప్రేమకావాలి’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన ఆది.. మొదటి చిత్రంతోనే మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు.

తాజాగా ఆది నటించిన ‘క్రేజీ ఫెలో’ సినిమాతో మరోసారి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. అయితే ఆది సినిమాలన్ని వరుసగా ప్లాప్ అవుతున్నప్పటికీ హీరోగా నిలదొక్కుకుంటున్నాడు. ఆయన సినిమాలు వరుసగా ప్లాప్ అవుతున్నా.. ఆ మూవీస్‌కి బిజినెస్ ఎలా వర్కౌట్ అవుతుందనే దానిపై ఆయన సీక్రెట్ రివీల్ చేశాడు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఆది ఇప్పటివరకు పదిహేను సినిమాల్లో నటించాడు. ఆయన నటించిన చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌గా నిలిచాయి. ఎదో కొన్ని సినిమాలు మాత్రమే ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణను పొందాయి. హీరో ఫ్లాపుల్లో కొనసాగుతున్నా.. నిర్మాతలు మాత్రం ఎప్పుడు ఆయనతో సినిమాలు చేయడానికి సిద్ధంగా ముందుకు వస్తున్నారు. అసలు నిర్మాతలు ఆదితో సినిమాలు చేయడానికి గల కారణం ఏంటో తెలిస్తే అందరూ షాక్ అవ్వాల్సిందే.

హీరో ఆది సాయి కుమార్‌తో సినిమా చిత్రీకరించాలంటే కనీసం రూ. రెండు కోట్ల బడ్జెట్ ఉంటే సరిపోతుందట. ఇక ఆయనతో సినిమా చేసే ఏ దర్శకుడైన కూడా పక్కా కమర్షియల్ ఫార్మేట్‌లోనే నిర్మిస్తూ ఉంటారు. అదే ఆయన సినిమాలకు ప్లస్ పాయింట్ అవుతుంది. అంతేకాదు.. ఆయన నటించిన ప్రతి సినిమాను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్ ప్రైమ్ ఆ సినిమాకు మంచి రేటుతో కొనుగోలు చేస్తుంది. అందుకే ఆది నటించిన చాలా వరకు సినిమాలు అమెజాన్ ప్రైమ్‌లోనే కనిపిస్తుంటాయి. ఈ సినిమాలు కనీసం కోటి రూపాయల కంటే ఎక్కువ బిజినెస్ చేస్తుంటాయి. యూట్యూబ్‌లో కూడా ఆది నటించిన సినిమాలకు మంచి డిమాండ్ ఉంది. హిందీ వెర్షన్‌లో విడుదలైన సినిమాలకు 100 మిలియన్లకుపైగా వీవ్స్ వస్తుంటాయి. అందుకే నిర్మాతలు కూడా హీరో ఆదితో సినిమాలు చేయడానికి ముందుకు వస్తుంటారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -