Abbas: హీరో విశాల్ చాలామందిని పాడు చేశాడు.. వైరల్ అవుతున్న అబ్బాస్ షాకింగ్ కామెంట్స్!

Abbas: ప్రేమదేశం సినిమా ద్వారా నటుడుగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి నటుడు అబ్బాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో తెలుగు తమిళ భాష చిత్రాలలో అవకాశాలను అందుకొని ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈయన ఉన్నపలంగా సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఇలా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి అబ్బాస్ విదేశాలలో స్థిరపడి కుటుంబ పోషణ కోసం ఎన్నో రకాల పనులు చేశారని తెలుస్తుంది.

ఈ విధంగా అబ్బాస్ ప్రస్తుతం ఇండియాలోనే ఉంటూ తిరిగి సినిమా ఇండస్ట్రీలోకి రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతూ వ్యక్తిగత విషయాల గురించి అలాగే సినిమాల గురించి మాట్లాడుతూ కొన్ని విషయాలు తెలియజేస్తున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈయన పలు విషయాలు గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా అబ్బాస్ విశాల్ గురించి మాట్లాడుతూ…

 

చాలా సంవత్సరాల క్రితం తనకు విషాల్ తో క్రికెట్ లీగ్ మ్యాచ్లో భాగంగా గొడవ జరిగిందని తెలిపారు.నాపట్ల విశాల్ చేసిన పనికి చాలా కోపం వచ్చింది కానీ ఆయన చేసిన తప్పుకు తాను ఎప్పుడో క్షమించానని తెలిపారు. ఇప్పటికి ఆయన ఎక్కడైనా కనిపిస్తే హాయ్ అని చెబుతాను కానీ తనతో ఎప్పటికీ బలమైన బంధాన్ని ఏర్పరచుకోలేను.సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి వారందరితో బలమైన బంధాన్ని ఏర్పరచుకోవాలని ప్రయత్నిస్తాను కానీ అది విశాల్ తో కుదరలేదని తెలిపారు.

 

సెలబ్రిటీల అందరిని ఒకే తాటిపై తెచ్చేదే సినీ క్రికెట్ లీగ్ అని ఈయన తెలియజేశారు. అయితే సిసిఎల్ రెండో సీజన్లో అతనితో ఒక గొడవ జరిగింది విశాల్ నా గురించి తప్పుడు ప్రచారాలు చేయడం ప్రారంభించాడు అదేవిధంగా ఇతరులను కూడా ఆయన తన మాటలతో పాడు చేశారని అబ్బాస్ తెలిపారు. నేను ఇష్టపడని వాతావరణంలో ఉండటం నాకు ఇష్టం లేదు అందుకే వెనక్కి తగ్గాను అంటూ ఈ సందర్భంగా విశాల్ గురించి చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -